భారత్కు చెందిన ఓ ఔషధాల తయారీ సంస్థకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అలర్ట్ జారీ చేసింది. ఆప్రికా దేశం గాంభియాలో 66 మంది చిన్నారుల మరణాలకు ఆ ఔషధాల తయారీ సంస్థ తయారు చేసిన దగ్గు మందు కారణమన్న అబియోగాలు రావడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తం అయ్యింది. భారత్ కు చెందిన ఆ సంస్థ భద్రతా ప్రమాణాలు పాటిస్తుందా లేదా అని తేల్చేందుకు దర్యాప్తు చేపట్టింది. హర్యానా కేంద్రంగా పనిచేసే మెయిడెన్ ఫార్మాసూటికల్స్ లిమిటెడ్ సంస్థ తయారు చేసిన నాలుగు రకాలు దగ్గు సిరప్లపై భారత ప్రభుత్వం కూడా విచారణకు అదేశించింది.
ఈ నాలుగు రకాల 'కలుషిత' సిరప్లు ఆఫ్రికన్ దేశమైన గాంబియాలో 66 మంది చిన్నారుల మృతికి, మరికొందరు కిడ్నీ సంబంధిత సమస్యల బారిన పడేందుకు కారణం కావచ్చొన్న వార్తల నేపథ్యంలో ఈమేరకు చర్యలు చేపట్టింది డబ్ల్యూహెచ్ఓ."ఈ నాలుగు ఔషధాలు.. భారత్లోని మెయిడెన్ ఫార్మాసూటికల్స్ లిమిటెడ్ ఉత్పత్తి చేసిన దగ్గు, జలుబు మందులు. ఆ కంపెనీతోపాటు భారత్లోని నియంత్రణ సంస్థలతో సమన్వయం చేసుకుంటూ ఈ వ్యవహారంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ దర్యాప్తు చేపడుతోంది." అని తెలిపారు ప్రపంచ అరోగ్య సంస్థ డైరక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్. ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల కుటుంబీకుల బాధ వర్ణనాతీతం అన్నారు.
ప్రొమెతజైన్ ఓరల్ సొల్యూషన్, కాఫెక్స్మాలిన్ బేబీ కాఫ్ సిరప్, మాకాఫ్ బేబీ కాఫ్ సిరప్, మేగ్రిప్ ఎన్ కోల్డ్ సిరప్ విషయంలో మెయిడెన్ ఫార్మాకు అలర్ట్ జారీ చేసింది డబ్ల్యూహెచ్ఓ. వీటి ఉత్పత్తిలో పూర్తిస్థాయిలో భద్రత, నాణ్యతా ప్రమాణాల్ని పాటించినట్టుగా ఇప్పటివరకు ఆ సంస్థ తమకు తగిన ఆధారాలు సమర్పించలేదని చెప్పింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఈ 'కలుషిత' ఔషధాలు ప్రస్తుతానికి గాంబియాలోనే వెలుగు చూసినా.. ఇతర దేశాలకూ వాటిని సరఫరా చేసి ఉండొచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. ఆ నాలుగు సిరప్లు మార్కెట్లో లేకుండా చేయాలని అన్ని దేశాలకు డబ్ల్యూహెచ్ఓ సూచించింది.
గాంబియాలో చిన్నారుల మరణాల నేపథ్యంలో ఈ నాలుగు ఔషధాలపై సెప్టెంబర్లో ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఫిర్యాదు అందింది. ఆయా సిరప్లలో అధిక మోతాదుల్లో డైఎథిలీన్ గ్లైకాల్, ఎథిలీన్ గ్లైకాల్ ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. ఆ రెండూ చాలా ప్రమాదకరమని, మరణానికీ కారణం కావచ్చని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. "డైఎథిలీన్ గ్లైకాల్, ఎథిలీన్ గ్లైకాల్ కారణంగా కడుపు నొప్పి, వాంతులు, డయేరియా, మూత్ర విసర్జనలో ఇబ్బందులు, తల నొప్పి, మానసికంగా అనిశ్చితి, తీవ్రమైన కిడ్నీ సమస్యలు తలెత్తి.. చివరకు మరణానికి దారి తీయవచ్చు" అని ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరించింది. సంబంధిత సంస్థలు ఆయా సిరప్లను విశ్లేషించి, క్లియరెన్స్లు ఇచ్చే వరకు వాటిని హానికరమైన ఔషధాలగానే పరిగణించాలని సూచించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more