Goddess blesses devotees in Sri Durgamma Devi avatar ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గమ్మదేవిగా కనకదుర్గమ్మ..

Goddess blesses devotees in sri durgamma devi avatar on day 8 of dasara festivities

Dussehra Navaratri celebrations, Indrakeeladri, Godess Kanaka Durgamma Devi as Sri Durgamma Devi, Sri Lalitha Tripura Sundari Devi, Sri Annapurna Devi, Sri Gayatri Devi, fourth Day of Durga Sarannavaratrulu, Sri Annapurna Devi, Sri Annapurna Devi history, Navaratri 4th day Sri Annapurna Devi, Sri Gayatri Devi, Sri BalaTripura Sundari Devi, Sri Chakra, Sri Yantra pooja, Tirpura Traya, Sri Maha Lakshmi Devi, Kanaka Durga Devi Ammavaru, Sri Swarna kavachalankrutha Durga Devi, Vijayawada, Andhra Pradesh

Hill atop shrine Indrakeeladri diety Kanakadurgamma is blessing the devotees in Sri Durgamma Devi on the eighth day of the nine-day Dussehra Navaratri celebrations. Kanaka Durgamma Devi Sharannavaratrulu whic began 26th Sepetember, will end on October 5 at the Indrakeeladri Ammavari Temple in Vijayawada.

దేవీ శరన్నవరాత్రులు 8వ రోజు: శ్రీ దుర్గమ్మదేవి అవతారంలో కనకదుర్గమ్మ..

Posted: 10/03/2022 11:11 AM IST
Goddess blesses devotees in sri durgamma devi avatar on day 8 of dasara festivities

విజయవాడలోని ఇంద్రకీలాద్రి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. దేవిశరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆరవరోజు అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలను నిర్వహిస్తున్నారు అర్చకులు. ఈ తొమ్మిది రోజలు పాటు అమ్మవారు ప్రతిరోజు ఒక్కో అవతారంలో భక్తలకు దర్శనాన్ని అనుగ్రహిస్తారు. దేవి శరన్నవరాత్రులు అక్టోబర్‌ ఆరవ తేదీ వరకు కొనసాగుతాయి. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న ఆలయ కమిటీ, రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ కూడా అన్ని ఏర్పాట్లు చేసింది.

తొలిరోజు దుర్గమ్మ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా కనకదుర్గమ్మ దేవీ భక్తులను అనుగ్రహించగా, రెండవ రోజూన బాలత్రిపుర సుందరి అవతారంలో, మూడవ రోజున గాయత్రీ దేవిగా.. నాల్గవ రోజున శ్రీ అన్నపూర్ణ దేవిగా.. ఐదవ రోజున లలితా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనవిచ్చిన కనకదుర్గమ్మతల్లి..ఆరవ రోజున శ్రీ మహాలక్ష్మీ దేవిగా, ఏడవ రోజున మూలా నక్షత్రయుక్తమున సరస్వతీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ముందునుంచి అంచనా వేసినట్లు ఆదివారం మూలా నక్షత్రం రావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. గత రెండేళ్లు కొవిడ్‌ కారణంగా దర్శనాలకు రాలేకపోయిన భక్తులు.. ఒక్కసారిగా ఆలయానికి మూలానక్షత్రం రోజున పోటెత్తారు.

సరస్వతీదేవి రూపంలోని అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన వారితో ఉదయం నుంచి తిరిగి రాత్రి వరకూ క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. ఇక ఎనమిదవ రోజున కనకదుర్గమ్మ తల్లి దుర్గమ్మతల్లిగా భక్తులను అనుగ్రహిస్తున్నారు. శరన్నవరాత్రులలో ఏడవ రోజు అమ్మవారు దుర్గమ్మ దేవిగా అనుగ్రహిస్తున్న తరుణంలో అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచే భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. దీంతో ఆలయం వద్ద క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది.

దసరా ఉత్సవాలలో ఎనిమిదో రోజు సోమవారం అమ్మవారు దుర్గాదేవి రూపంలో భక్తులకు దర్శనమివ్వనుంది. ‘లోక కంఠకుడైన దుర్గమాసురుడు అనే రాక్షసుడిని సంహరించి దుర్గతులను పోగొట్టి దుర్గగా వెలుగొందింది. దుర్గమాసురుడిని సంహరించిన తర్వాత కీలాద్రిపై అమ్మవారు స్వయంగా ఆవిర్భవించింది. దుర్గే దుర్గతినాశని.. అనే వాక్యం శుభాలను కలగజేస్తుంది. శరన్నవరాత్రి ఉత్సవాలలో దుర్గాదేవిని దర్శించుకోవడం వల్ల దుర్గతులను పోగొట్టి సద్గతులను ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం’. దివ్యరూపిణి అయిన దుర్గమ్మ దర్శనానికి ఏటా భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles