మహారాష్ట్ర రాజకీయాలు అంటేనే దేశం మొత్తం ప్రాధాన్యత సంతరించుకుంటాయి. ఇటీవలే తనకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన శివసేన పార్టీ అధినేత ఉద్దవ్ థాకరే ను కాదని తాన పక్షమే అసలైన శివసేన పార్టీ అంటూ ప్రకటించుకున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షింగే.. తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఆయనకు చెందిన కుర్చీలో ఆయన వారసుడు కూర్చోని అదేశాలు ఇస్తుండగా, ఆయన ఎదుట అధికారులు చేతులు కట్టుకున్నారు. తాజాగా సామాజిక మాధ్యమాల్లో ఈ ఫోటో హల్చల్ చేస్తోంది. ఇది మహారాష్ట్రలో రాజకీయాల్లో పెను దుమారానికి కారణమైంది.
ఈ ఫోటోలో సీఎం ఏక్నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న ఫొటో ఇది. ఆ గదిలో ప్రభుత్వాధికారులు చేతులు కట్టుకుని నిల్చుని ఉన్నారు. ఆయన చేతిలో ఓ ఫైల్ ఉండడం ఈ మొత్తం దుమారానికి కారణమైంది. ఇక ఈ కుర్చీ వెనుక పెద్ద పెద్దని తాటికాయంతటి అక్షరాల్లో ముఖ్యమంత్రి, మహారాష్ట్ర ప్రభుత్వం అని కూడా రాసిఉంది. అయినా ఈ కుర్చీలో కూర్చోని షిండే వారసుడు అధికారులకు ఏవో అదేశాలు ఇస్తుండటం తీవ్ర విమర్శలకు కారణమయ్యింది. ఈ ఫొటో వెలుగులోకి రావడంతో విపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి.
‘సూపర్ సీఎం’ అని ఒకరు విమర్శిలు చేస్తుంటే.. బాప్ నెంబరీ తో బేటా దస్ నంబరీ అంటూ మరోకరు విమర్శలు గుప్పిస్తున్నారు. అయినా ముఖ్యమంత్రి కుర్చీ అని పెద్ద అక్షరాలతో రాసి ఉన్నాక కూడా ఆయన అక్కడే కూర్చోని అధికారులకు అదేశాలిస్తుండటం ఏంటని కూడా ప్రశ్నిస్తున్నాయి. ఈ విమర్శలపై శ్రీకాంత్ షిండే స్పందించారు. ముఖ్యమంత్రి రోజుకు 18 నుంచి 20 గంటలు పనిచేస్తున్నారని అన్నారు. ఆయన చాలా సమర్థుడైన సీఎం అని, ఆ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని తేల్చి చెప్పారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటో థానే నివాసంలోనిదని, అది సీఎం అధికారిక నివాసం కాదని వివరణ ఇచ్చారు. సీఎంతోపాటు తాను కూడా దానిని ఉపయోగించుకుంటూ ఉంటానని శ్రీకాంత్ స్పష్టం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more