ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు సమతూల్యతతో అభివృద్ది చెందుతాయని నమ్మకాన్ని వ్యక్తంచేస్తోంది. కాగా ఈ విషయంలో రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు ఇచ్చిన అదేశాలు అమలుచేసే విషయంలోనూ మిన్నకుండిన ఏపీ ప్రభుత్వం.. ఇక మూడు రాజధానుల అంశంపై తేల్చివేసేందుకు దేశ సర్వోన్నత న్యాయస్థానం తలుపుతట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇవాళ దేశ అత్యున్నత న్యాయస్థాం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆరు నెలల్లో అమరావతిని అభివృద్ధి చేయాలన్న హైకోర్టు ఆదేశాలు సాధ్యంకాదని తమ పిటీషన్లో ఏపీ ప్రభుత్వం పేర్కొంది.
అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే మూడు రాజధానుల ప్రతిపాదన అని ప్రభుత్వం వివరించింది. మూడు రాజధానుల చట్టం రద్దుపై హైకోర్టుకు జోక్యం చేసుకునే అధికారం లేదని స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పు శాసన వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నట్లుగా ఉందని పిటిషన్లో పేర్కొంది. రాజధాని అంశంపై చట్టం చేసే అధికారం శాసనసభకు లేదని గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాలు చేస్తు ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లింది. అమరావతే రాజధాని అని ఇచ్చిన తీర్పును నిలిపివేయాలని విన్నవించింది. హైకోర్టు తీర్పుపై వెంటనే స్టే ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. సీఆర్డీ చట్టం ప్రకారమే చేయాలనడం అసెంబ్లీ అధికారాలను ప్రశ్నించడమేనని పిటిషన్లో ప్రభుత్వం పేర్కొంది.
అయితే అమరావతి మాత్రమే ఏకైక రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అమరావతి ప్రాంత రైతులు వెయ్యి రోజులకు పైగా నిరసన దీక్షలు చేస్తూనే ఉన్నారు. తమ భూములను తీసుకుని అమరావతి రాష్ట్ర రాజధానిగా అభివృద్ది చేస్తామన్న ప్రభుత్వం.. ఇప్పుడు అన్యాయం చేస్తోందని వారు అరోపిస్తున్నారు. ప్రభుత్వాలు తమకిచ్చిన మాట ప్రకారం తమ ప్రాంతాన్ని అభివృద్ది చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమ నుంచి ప్రభుత్వం భూములను తీసుకునేప్పుడు మూడు రాజధానుల ప్రతిపాదనే లేదని.. అలాంటిది పాలకులు మారిపోగానే.. ప్రభుత్వాలు తమ నిర్ణయాలను ఎలా మార్చేసుకుంటాయని రైతులు ప్రశ్నిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more