తెలుగు రాష్ట్రాలపై మునుపెన్నడూ లేని విధంగా వరుణుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని జలాశయాలను, వాగులు, వంకలు, నదులు, కాలువలను నిండుకుండలా మార్చేసిన వరుణుడు.. ఇప్పటికీ శాంతించడం లేదు. ఫలితంగా తెలుగురాష్ట్రాలలో వర్షాలు కురుస్తూనే వున్నాయి. ఇక తాజాగా భారత వాతావరణ శాఖ మరో వార్తతో తెలుగు రాష్ట్రాల ప్రజలు అందోళన చెందుతున్నారు. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వాసులకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రానున్న రెండు రోజల్లో ఏపీ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం కారణంగా రేపు, ఎల్లుండి ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాయుగుండం బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశముందని వెల్లడించింది. ఈ వాయుగుండం ప్రసుత్తం ఒరిస్సాలోని బాలాసోర్కు దగ్గర్లో గంటకు 20 కిమీ వేగంతో వాయివ్యంగా ప్రయాణి స్తోందని సంబంధిత శాఖాధికారులు తెలిపారు. ఈ కారణంగా ఒరిస్సా, ఝూర్ఖండ్, చత్తీస్ఘడ్, వెస్ట్ బెంగాల్ రాష్రాలతో పాటు ఏపీలోని ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాల్లో శని, ఆదివారాల్లో భారీ వర్షాలు అవకాశాలున్నాయని స్పష్టం చేసింది . దీంతో విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు ఎల్లో హెచ్చరికను జారీ చేసింది .
ఇక ఇటు తెలంగాణలోనూ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. రాజధాని హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో గ్యాప్ లేకుండా ఏదో ఒక ప్రాంతంలో వరుణుడు తన ప్రతాపాన్ని చాటుతూనే ఉన్నాడు. ఇక తాజాగా పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. పలు బస్తీల్లోకి వర్షపు నీరు చేరడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చార్మినార్, యాకుత్పురా, ఉప్పుగూడ, బహదూర్పురా, చాంద్రాయణగుట్ట, బాలాపూర్, బార్కస్, ఆరాంఘర్, మెహిదీపట్నం, గండీపేట్, టోలీచౌకి, సరూర్నగర్, మలక్పేట, ఎల్బీనగర్తో పాటు ప్రాంతాల్లో వాన దంచికొట్టింది. ఈ ఏరియాల్లో జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు చేపట్టారు.
VERY HEAVY RAIN AT #FALAKNUMA @balaji25_t @Rajani_Weather @HiiHyderabad @HiHyderabad @MDShoai46159754 #HyderabadRains Stay Safe #Hyderabadiss... pic.twitter.com/315eQp2Z7g
— Ahmed SAM (@AhmedSAM7272) August 19, 2022
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more