విమానంలో తోటి ప్రయాణికుడు తన గాళ్ ఫ్రెండ్తో చేస్తున్న చాటింగ్ను వెనక సీట్లో కూర్చున్న ప్రయాణికురాలు చూడడంతో విమానం ఆరుగంటలపాటు నిలిచిపోయింది. కర్ణాటకలోని మంగళూరు విమానాశ్రయంలో జరిగిందీ ఘటన. మంగళూరు నుంచి ముంబై వెళ్లే ఇండిగో విమానం టేకాఫ్కు రెడీ అయింది. ప్రయాణికులు సీటు బెల్టులు ధరించి సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలో విమానంలో తన ముందు సీట్లో కూర్చున్న యువకుడు తన ప్రియురాలితో చేస్తున్న చాటింగ్ను వెనక సీట్లో కూర్చున్న ఓ ప్రయాణికురాలు చూసింది. అందులో ‘యు ఆర్ ద బాంబర్’ అన్న మెసేజ్ కనిపించింది.
కీడు శంకించిన ఆమె వెంటనే విషయాన్ని విమాన సిబ్బంది దృష్టికి తీసుకెళ్లింది. అప్రమత్తమైన కేబిన్ సిబ్బంది దానిని పైలట్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన వెంటనే విషయాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ కు చేరవేసి.. దీంతో విమానం టేకాఫ్ ఆగిపోయింది. ఆ తర్వాత విమానంలోని 185 మంది ప్రయాణికులను కిందికి దించేసి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అయితే, అందులో అనుమానాస్పదంగా ఎలాంటి వస్తువు కనిపించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా, తాను తన ప్రియురాలు సరదాగా చేసుకున్న ఫన్ టాక్ మాత్రమేనని.. సదరు ప్రయాణికుడు చెప్పారు.
మరోవైపు, చాటింగ్ చేసిన యువకుడిని, అదే విమానాశ్రయంలో బెంగళూరు వెళ్లే విమానం కోసం ఎదురుచూస్తున్న అతడి ప్రియురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కొన్ని గంటలపాటు ప్రశ్నించారు. వారి సంభాషణ సరదాగా సాగిందని తేలడంతో విమానం బయలుదేరేందుకు అధికారులు అనుమతినిచ్చారు. దాదాపు ఆరుగంటలపాటు నిలిచిపోయిన విమానం చివరికి సాయంత్రం 5 గంటలకు బయలుదేరింది. అయితే, విచారణ జరుగుతున్న నేపథ్యంలో యువకుడిని వెళ్లేందుకు అనుమతించలేదు, అలాగే అతడి ప్రియురాలు కూడా బెంగళూరు వెళ్లే విమానాన్ని మిస్సైంది. కాగా, వారిద్దరి మధ్య జరిగింది ఫ్రెండ్లీ చాటింగేనని, ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో కేసు నమోదు చేయలేదని అధికారులు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more