లోన్ యాప్ ల ఆడగాల శృతిమించుతున్నాయి. చిటికలో రుణాలు ఇస్తామని చెప్పి.. తప్పనిసరి పరిస్థితుల్లో రుణాలను పొందిన రుణగ్రస్థుల నుంచి ముక్కుపిండి మరీ వడ్డీలతో పాటు రుణాలను తిరిగిపోందుతున్న డిజిటల్ యాప్ లపై ఎట్టకేలకు ఆర్బీఐ కోరడా జుళిపించింది. రుణగ్రస్తులకు రుణాలు ఇచ్చేందుకు వారి మొబైల్ ఫోన్ లోని వాట్సాఫ్, కాంట్రాక్టు జాబితాల అనుమతిని బలవంతంగా తీసుకుని ఒకవేళ వారు రుణాలు తిరిగి సకాలంలో చెల్లించని పక్షంలో వారి వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగేలా చర్యలకు పాల్పడుతున్నాయి.
వీటి ఆగడాలు ఎంతలా ఉన్నాయంటే.. ఏకంగా బ్యాంకు ఉద్యోగినే ఆత్మహత్యకు ప్రేరేపించే స్థాయిలో ఉన్నాయంటే ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇక ఒకటి, రెండు నుంచి ఏకంగా పదుల సంఖ్యలో వచ్చిన డిజిటల్ యాప్ లు ప్రస్తుతం వందకు పైగా చలామణిలో ఉన్నాయి. విస్తృతం కాగా, అదే సమయంలో పలు యాప్ ల నిర్వాహకులు రుణగ్రస్తుల పట్ల వ్యవహరిస్తున్న తీరు దిగ్భ్రాంతిని కలిగించేలా ఉంది. రుణగ్రస్తులపై వ్యక్తగత ప్రతిష్టకు భంగం కలిగేలా వారి పరువు మర్యాదాలపై రుణసంస్థలు దాడి చేస్తున్నాయి. బెంగళూరులో ఓ బ్యాంకు ఉద్యోగి, తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగిని ఇలా దేశవ్యాప్తంగా అనేక మరణాలకు వీరు కారణం అవుతున్నారు.
ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ స్పందించింది. దేశంలో డిజిటల్ విధానంలో రుణాల మంజూరు క్రమానుగతంగా వృద్ధి చెందుతుందన్న నేపథ్యంలో, వివిధ వర్గాల్లో పెరుగుతున్న ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని నియంత్రణ వ్యవస్థను బలోపేతం చేసినట్టు ఆర్బీఐ వెల్లడించింది. రిజర్వ్ బ్యాంక్ నియంత్రణలో ఉన్న సంస్థలు, లేక అనుమతి పొందిన మరేవైనా ఆర్థిక సంస్థల అధీనంలోని సంస్థలను ఆధారంగా చేసుకుని ఈ నియంత్రణ వ్యవస్థకు రూపకల్పనం చేయడం జరిగిందని ఆర్బీఐ ఒక నోటిఫికేషన్ లో వివరించింది. డిజిటల్ విధానంలో అప్పులు ఇచ్చే సంస్థలను మూడు కేటగిరీలుగా విభజిస్తున్నట్టు ఆ నోటిఫికేషన్ లో పేర్కొంది.
అవి 1.) ఆర్బీఐ అనుమతి పొంది రుణ మంజూరు వ్యాపారం చేసే సంస్థలు. 2) ఆర్బీఐ నియంత్రణలో లేని... ఇతర చట్టబద్ధమైన, నియంత్రణ నిబంధనలకు లోబడి నడుచుకునే రుణ సంస్థలు. 3) ఎలాంటి చట్టబద్ధత లేని, నియంత్రణ నిబంధనలకు లోబడని సంస్థలుగా విభజించింది.కొత్త నిబంధనల ప్రకారం... అన్ని రుణ పంపిణీలు, తిరిగి చెల్లింపులు రుణ గ్రహీత, ఆర్థిక సంస్థ బ్యాంకు ఖాతాల మధ్యనే జరగాలని, ఇందులో మూడవ పక్షానికి తావు ఉండరాదని ఆర్బీఐ పేర్కొంది. అంతేకాదు, రుణ సంస్థకు చెల్లించే ఫీజు, చార్జీలు ఇతరత్రా నేరుగా నియంత్రణ వ్యవస్థ ద్వారానే చెల్లించబడతాయి. ఇందులో రుణ గ్రహీతపై భారం ఉండదు.
అంతేకాదు, రుణ పరిమితిపై రుణ గ్రహీతల అనుమతి లేకుండా ఆటోమేటిక్ పెంపుదలను ఈ నిబంధనలు నిరోధిస్తాయి. ఇక, వినియోగదారుల ఫిర్యాదులను నియంత్రణ వ్యవస్థలు 30 రోజుల్లోగా పరిష్కరించకపోతే, సదరు రుణ గ్రహీత రిజర్వ్ బ్యాంక్-ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్ మన్ స్కీమ్ కింద ఫిర్యాదు చేయవచ్చు. ముఖ్యంగా, లోన్ యాప్ లు రుణగ్రహీత అనుమతి లేకుండా అతడి డేటా సేకరించరాదని ఆర్బీఐ స్పష్టం చేసింది. అంతేకాదు, తన సమాచారాన్ని సేకరించేందుకు సదరు యాప్ కు గతంలో ఇచ్చిన అనుమతిని తర్వాత కాలంలో తొలగించేందుకు కూడా రుణగ్రహీతలకు ఆప్షన్ ఇవ్వాలని పేర్కొంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more