కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుటుంబసభ్యుల ప్రమేయం కూడా ఉందని ఈ కేసులో కీలక నిందితురాలైన స్వప్నా సురేష్ గత కొన్నాళ్లుగా అరోపిస్తున్న విషయం తెలిసిందే. నేరుగా సీఎంను ఆయన కుటుంబసభ్యులను టార్గెట్ చేసి.. అరోపణలు సంధిస్తోన్న ఈమె.. తాను కేసులోంచి బయటపడేందుకు గతకొన్నాళ్లుగా అరోపణలు సంధిస్తున్నారన్న వార్తలు కూడా వినిపించాయి. కేరళ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెరపైకి వచ్చిన ఈ కేసుతో ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రతిష్టను భంగపర్చి ఆయనకు అధికారాన్ని దూరం చేయాలని భావిస్తోందన్న విమర్శలు వచ్చాయి.
అయితే అదే అతనికి కలసివచ్చింది. ఈ అరోపణలను పట్టించుకోని కేరళ ప్రజలు విజయన్ నేతృత్వంలోని ప్రభుత్వానికి మరోమారు అధికారాన్ని అందించారు. కాగావిజయన్ ను మళ్లీ టార్గెట్ చేసిన కేరళ స్మగ్లింగ్ కేసు ప్రధాన నిందితురాలు స్వప్న సురేష్ మళ్లీ సంచలన ఆరోపణలు చేశారు. 2017లో అనుమానాస్పద ఉగ్రవాదిగా పట్టుబడిన వ్యక్తిని.. తన కూతరు అక్రమ వ్యాపారాల బయటపడకుండా చేసేందుకు తప్పించుకునేలా సహాయం అందించారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈజిప్టులో జన్మించిన యూఏఈ జాతీయుడు.. భారత్ కు వచ్చిన సందర్బంగా అతడ్ని కొచ్చిన్ విమానాశ్రయంలో సీఐఎస్ఎప్ బలగాలు అదుపులోకి తీసుకున్నాయని తెలిపారు.
దేశంలో నిషేధించిన తురయా శాటిలైట్ ఫోన్తో ఆయన రావడమే అందుకు కారణమన్నారు. అయితే అతడ్ని పట్టుబడనీయకుండా తప్పించేందుకు విజయన్ సహకరించారని ఆరోపించింది. స్వప్నా సురేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈజిప్ట్లో జన్మనించిన యూఏఈ జాతీయుడు జూన్ 30న కేరళకు చేరుకోగా, జూలై 4న సీఐఎస్ఎఫ్ అరెస్టు చేసింది. యూఏఈ కాన్సులేట్ అధికారుల నుంచి తనకు కాల్ వచ్చిందని, ఈ విషయంలో సీఎంతో మాట్లాడాలని కోరినట్లు తెలిపింది. తాను సీఎం కార్యదర్శి శివశంకర్రెడ్డితో మాట్లాడి మొత్తం విషయాన్ని చెప్పానని, ఆయన విజయన్తో మాట్లాడతానని చెప్పారన్నారు. ఆ తర్వాత సదరు వ్యక్తిని పోలీసులు విడుదల చేశారని.. మళ్లీ ఈ విషయంలో విచారణ జరుగలేదని స్వప్నా ఆరోపించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more