హిమాచల్ ప్రదేశ్లో కుంభవృష్టి కురిసింది. కులు జిల్లాలోని పర్వతి లోయలో ఉన్న చోజ్ ముల్లా వద్ద అకస్మాత్తుగా క్లౌడ్బస్ట్ అయ్యింది. ఈ ఘటన వల్ల స్థానిక గ్రామాల్లో భారీ నష్టం సంభవించింది. చోజ్ గ్రామంలో క్లౌడ్బస్ట్ కావడం వల్ల నలుగురు గల్లంతు అయినట్లు కులు ఎస్పీ గురుదేవ్ చాంద్ శర్మ తెలిపారు. పార్వతి నదిలో అకస్మాత్తుగా వరద పెరగడంతో సమీపంలో ఉన్న క్యాంపు సైట్లన్నీ ఆ ధాటికి కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. ఆ వరద ప్రభావం వల్ల కొందరు టూరిస్టులు కొట్టుకుపోయి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. చోజ్ గ్రామంతో లింకు ఉన్న బ్రిడ్జ్ ధ్వంసం అయ్యింది. నది సమీపంలో ఉన్న ఆరు కేఫ్లు కూడా వరద నీటిలో కొట్టుకుపోయాయి.
షిమ్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఓ భారీ రాయి వచ్చి కారు మీద పడడంతో.. ఓ మహిళ మృతిచెందింది. ఇద్దరు గాయపడ్డారు. దల్లీ టన్నెల్ వద్ద ఈ ఘటన జరిగింది. మంగళవారం రాత్రి నుంచి షిమ్లాలో ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఫిరోజ్పూర్-షిప్కీ జాతీయ రహదారిని మూసివేశారు. బ్రోనీ నుల్లాలో నీటి ప్రవాహం పెరగడంతో హైవేను బ్లాక్ చేశారు. కులు జిల్లాలోని మలనా ప్రాజెక్టు వద్ద అకస్మిక వరదలు సంభవించాయి. ఓ బిల్డింగ్లో చిక్కుకున్న 30 మంది ఉద్యోగులను సురక్షితంగా తరలించారు. ఫ్లాష్ ఫ్లడ్స్లో వాహనాలు ధ్వంసం అయ్యాయి.
ముంబైని ముంచెత్తిన వర్షం
ముంబైలో ఇవాళ కూడా వర్షాలు ముంచెత్తడంతో జనజీవనం స్తంభించిపోయింది. శివారు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. దీంతో ట్రాఫిక్ ఇబ్బందులు కూడా ఏర్పడుతున్నాయి. శుక్రవారం వరకు ముంబైతో పాటు శివారు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణశాఖ హెచ్చరించిన విషయం తెలిసిందే. నగరంలోని కొన్ని రూట్లలో రైలు, బస్సు సర్వీసులపై ప్రభావం పడింది. లోతట్టు ప్రాంతాలు, రైల్వే ట్రాక్లు మునిగిపోవడంతో ట్రాఫిక్ నిలిచిపోతోంది. సోమవారం నుంచి ముంబైలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. కొన్ని నదుల్లో నీటి స్థాయి పెరుగుతూనే ఉంది. రాయిగడ్, రత్నగిరి జిల్లాలకు రెడ్, ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేశారు. తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఏక్నాథ్ షిండే ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more