ప్రముఖ వ్యాపారదిగ్గజం.. మహీంద్రా గ్రూప్ ఆప్ కంపెనీస్ అధినేత ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండారని తెలుసు. ఆయన తనదైనశైలిలో పలు వీడియోలు, ఫోటోలను షేర్ చేసుకుంటారని కూడా తెలుసు. ఇందులో మనస్సును హత్తుకునేవి, మానవత్వంతో స్పందించేవి కూడా చాలనే ఉన్నాయి. అటో విడిభాగాలతో జీపును తయారు చేసిన వారికి బోలెరో వాహనాన్ని ఇవ్వడం కానీ.. తన కుటుంబాన్ని పోషించుకునేందుకు కాళ్లు చేతులు లేని దివ్యాంగుడికి తన సంస్థలో ఉద్యోగం కల్పించడం ఇలా పలువురికి తన సంస్థ తరపున చేయగలిగినంత చేస్తారాయన.
అలాంటి ఈ పారిశ్రామిదిగ్గజానికి ఓ నెటిజన్ నుంచి ఎదురైన ప్రశ్నకు ఆయన తనదైన శైలిలోనే బదులిచ్చారు. నెటిజన్ అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం ఇస్తే ఆయన ఆనంద్ మహీంద్రా ఎందుకు అవుతారు.? అందుకనే ఆయన సమాధానం కూడా చమత్కారంగా.. ఇచ్చారు. తానడిగిన ప్రశ్నకు ఇలాంటి సమాధానం లభిస్తుందని బహుశా ఆ నెటిజన్ కూడా ఊహించిఉండకపోవచ్చు. వైభవ్ అనే నెటిజన్.. సర్... మీ క్వాలిఫికేషన్ ఏంటో తెలుసుకోవచ్చా? అంటూ ట్వీట్ చేశాడు. అందుకు ఆనంద్ మహీంద్రా స్పందించారు. "నిజం చెప్పాలంటే... నేనిప్పుడున్న వయసులో ఏ యోగ్యతకైనా అనుభవం మాత్రమే అర్హత" అని పేర్కొన్నారు. ఆనంద్ మహీంద్రా సమాధానం అనేకమంది నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
అదే సమయంలో, ఆనంద్ మహీంద్రా క్వాలిఫికేషన్ అడిగిన నెటిజన్ పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అసలు ఈ చర్చకు కారణం ఓ బాలిక ఫొటో. హిమాచల్ ప్రదేశ్ లోని పర్వత ప్రాంతంలో ఓ గుట్టపై కూర్చుని చదువుకుంటున్న ఆ బాలిక ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన అభిషేక్ దూబే అనే వ్యక్తి ఆనంద్ మహీంద్రాను కూడా ట్యాగ్ చేశారు. దానిపై ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ, ఈ ఫొటో ఎంతో బాగుందని, ఆ బాలికను తాను ప్రేరణగా తీసుకుంటానని వెల్లడించారు. ఈ క్రమంలోనే వైభవ్ అనే నెటిజన్ ఆనంద్ మహీంద్రా క్వాలిఫికేషన్ తెలుసుకునే ప్రయత్నం చేశాడు.
(And get your daily news straight to your inbox)
Aug 17 | స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకల వేళ.. ప్రధాని నరేంద్రమోడీ ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా చేసిన ప్రసంగానికి ఆ మరుసటి రోజున.. బీజేపి పాలిత రాష్ట్రంలోనే తూట్లు పోడిచారు. ప్రధాని మోడీ సోంత రాష్ట్రం... Read more
Aug 17 | జేబులో డబ్బులు పెట్టుకుని తిరిగితే.. ఎవరైనా జేబు దొంగలు కొట్టేస్తారేమో అన్న అందోళన అవసరం లేకుండా.. ఎంచక్కా.. డిజిటల్ పే వచ్చేసింది. ఇక ఎదో ఒకచోట డబ్బు అవసరం అయితే.. అక్కడికక్కడే కనిపించే ఏటీఎంకు... Read more
Aug 17 | మహారాష్ట్రలో ఘోర ప్రమాదం సంభవించింది. మహారాష్ట్రలోని గోండియా జిల్లాలో ఎదురెదురుగా వస్తున్న రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఎదురుగా వస్తున్న గూడ్సు రైలును.. అదే మార్గంలో వస్తున్న ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. దీంతో ప్యాసింజర్ రైలులోని... Read more
Aug 17 | మధుమేహ రోగులకు శుభవార్తను అందించారు వైద్యశాస్త్ర పరిశోధకులు. కరోనా మహమ్మారి బారిన పడిన మధుమేహ వ్యాధిగ్రస్తులు దాని నుంచి బయటపడేందుకు మానసికంగా, శారీరికంగానూ చేసిన పోరాటం వల్లే అనేక మంది బతికి బయటపడగా, కొందరు... Read more
Aug 17 | కలియుగ వైకుంఠంగా బాసిల్లుతున్న తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు కరోనా మహమ్మారికి మునుపటి స్థితికి చేరుకుని ఇప్పుడిప్పుడే భక్తులకు ఆలవాలంగా మారుతోంది. ఈ తరుణంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్... Read more