నేటి భారతీయ సమాజం మత, కులాలపై ఆధారపడి పయనాన్ని సాగిస్తోంది. ఇవే లేకపోతే దేశం మరింత ప్రగతిపధంలోకి దూసుకెళ్లేదని మైకు పట్టుకున్న ప్రతీ నాయకుడు చెప్పే విషయమే. అయితే అది అంబేద్కర్ జయంతి రోజునో.. లేద స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవాల రోజునో అదీ కాకపోతే గాంధీజయంతి రోజునో చెబుతుంటారు. అయితే ఆ కార్యక్రమాలు ముగిసిన తరువాత తమ దారి తమదనే వెళ్లిపోతారు. ఏం చేసినా వారు చెప్పిన మాటలకు వారు కట్టబుడి ఉండరు. ఇలా దాదాపుగా అందరు నేతలు చేసేదే. అయితే ఈ నేత మాత్రం అందుకు పూర్తి భిన్నం.
కుల సమాజం అన్నది లేదని, అందరూ ఒక్కటేనని చెప్పిన ఆయన ఆ మాటకు తాను కట్టుబడి ఉంటానని చెప్పారు. వీళ్లు తక్కువ కులం. వాళ్లు అగ్రవర్ణం ఇలాంటి తేడాలతో మనకు మనమే హద్దులు ఏర్పర్చుకుని.. అందులోనే బతుకుతున్నామని.. ఇంకా ఎంతకాలం ఇలాంటి కులహద్దులని ఆయన ప్రశ్నించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి.. 75 ఏళ్లు కావస్తున్న తరుణంలోనూ ఇలా పయనించడం సమంజసం కాదని అన్నారు. ఎవరూ తక్కువ కాదు.. ఎక్కువ కాదు అని ఆయన దళితుడు స్వామిజీ నోట్లో పెట్టుకున్న ఆహారాన్ని తీయించి తిన్నారు. ఆయనే కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ ఖాన్.
#WATCH Bengaluru, Karnataka: In an attempt to set an example seemingly against caste discrimination, Congress Chamarajapete MLA BZ Zameer A Khan feeds Dalit community's Swami Narayana & then eats the same chewed food by making Narayana take it out from his mouth to feed him(22.5) pic.twitter.com/7XG0ZuyCRS
— ANI (@ANI) May 22, 2022
(And get your daily news straight to your inbox)
Jul 02 | దేశంలో రాష్టప్రతి ఎన్నికలకు తెర లేచిన సందర్భంలో ఈ ఎన్నికలు ఇద్దరు వ్యక్తులకు సంబంధించినవి కావని, రెండు సిద్దాంతాల మధ్య పోరుగా విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా పేర్కోన్నారు. దేశంలో నెలకొన్న ‘అసాధారణ... Read more
Jul 02 | భూమిపైన ఉన్న జంతుజాలంలో మనకు కనబడనవాటినే మనం గుర్తిస్తాం. కానీ మనకు తెలియని ఎన్నోరకాల జీవచరాలు భూమిపై ఉన్నాయన్న విషయం మీకు తెలుసా.? ఇక మనకు తెలిసిన వాటిలోనూ ఎన్నో అరుదైన జీవులు వున్నాయని,... Read more
Jul 02 | రాష్ట్రపతి ఎన్నికల్లో ఆత్మప్రభోదానుసారం ఓటు వేయాలని సీఎం కేసీఆర్ కోరారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్ధతుగా టీఆర్ఎస్ నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. యశ్వంత్ సిన్హా ఉన్నత వ్యక్తిత్వంగలవారని తెలిపారు. న్యాయవాదిగా... Read more
Jul 02 | దేశీయ విమానయాన సంస్థ స్పైస్జెట్కు చెందిన ఓ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. అత్యంత వేగంగా స్పందించిన పైలట్లు వెనువెంటనే తీసుకున్న చర్యలతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకుండా ప్రయాణికులతో పాటు క్యాబిన్... Read more
Jul 02 | దేశంలోనే అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల బలపర్చిన అభ్యర్థి, మాజీ కేంద్రమంత్రి యశ్వంత్ సిన్హా హైదరాబాదుకు చేరుకున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన ప్రత్యేక విమానంలో ఆయన బేగంపేట ఎయిర్... Read more