కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై రాజస్థాన్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. దేశంలో జరుగుతున్న అన్ని మతఘర్షణలపై వివాదం రాజేయడానికి కారణం ఎవరో చెప్పే ధైర్యం ఉందా.? అని ప్రశ్నించారు. దమ్ముంటే శ్రీరామ నవమి నాడు ఏడు రాష్ట్రాల్లో జరిగిన అల్లర్లపై దర్యాప్తునకు కమిటీ వేయాలని సవాల్ విసిరారు. అప్పుడే ఈ అల్లర్ల వెనక కారణం ఏమిటన్నది తెలుస్తుందని అన్నారు. అలాగే ఈ దర్యాప్తు అనంతరం భవిష్యత్తులో మరెక్కడా కూడా అల్లర్లు జరుగవని వ్యాఖ్యానించారు.
రాజస్థాన్లోని కరౌలి, జోధ్పూర్లో జరిగిన హింసాకాండపై సీఎం అశోక్ గెహ్లాట్ మీడియాతో గురువారం మాట్లాడారు. హిందూ సంవత్సరం ఆరంభమైన ఏప్రిల్ 2న కరౌలిలో జరిగిన అల్లర్లు ‘ల్యాబరేటరీ ఎక్స్పెర్మెంట్’ అని అన్నారు. అయితే శ్రీరామ నవమి సందర్భంగా ఇక్కడ ఎలాంటి అల్లర్లకు తాము తావివ్వలేదని చెప్పారు. మరోవైపు కరౌలి రీతిలో శ్రీరామ నవమి నాడు ఏడు రాష్ట్రాల్లో అల్లర్లు జరిగాయని అశోక్ గెహ్లాట్ తెలిపారు. దేశంలో ఎన్నడూ లేని విధంగా గత కొన్ని ఏళ్లుగా బీజేపి పాలనలో మాత్రమే అలర్లు జరుగుతున్నాయిని ఆయన నిలదీశారు.
అమిత్ షాకు ధైర్యం ఉంటే సుప్రీంకోర్టు లేదా హైకోర్టు జడ్జీ నేతృత్వంలోని కమిటీతో ఈ అల్లర్లకు మూల కారణంపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. అప్పుడు అంతా తేలిపోతుందని, భవిష్యత్తులో ఇలాంటి అల్లర్లు జరగవని అన్నారు. కాగా, రాజస్థాన్లో వరుస అల్లర్లకు బీజేపీనే కారణమని సీఎం అశోక్ గెహ్లాట్ ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో రాష్ట్రంలో అల్లర్లను రాజేసేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. మతం, కులం పేరుతో రాజకీయాలు ప్రమాదకరమని, దేశానికి ఎలాంటి లబ్ధి చేకూర్చవని అన్నారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులు చాలా ఆందోళనకరంగా ఉన్నాయన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more