దేశంలో ఎండలు భగ్గుమంటున్నారు. సూర్యుడి ప్రతాపానికి ప్రజలు అల్లాడిపోతున్నారు. అనేక ప్రాంతాల్లో వడగాలులు సైతం విరుచుకుపడుతున్నాయి. ఇంకా మే నెల మొదలు కాకుండానే.. అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఇప్పటికే 45డిగ్రీలు దాటిపోయాయి. తెలంగాణలోని అదిలాబాద్ లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అటు ఒడిశాలోనూ ఎండలు దడదడలాడిస్తున్నాయి. దీనికి తోడు ఒడిశాలో వడగాల్పులు రాష్ట్రప్రజలను బయటకు రానీయకకుండా కట్టడి చేస్తున్నాయి. ఒడిశాలో హీట్వేవ్ కొనసాగుతోందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
రాష్ట్రంలో మరికొన్ని రోజులు పాటు ఉష్ణోగ్రతలు భారీస్థాయిలో ఉంటాయని అంచనావేసింది. ఈ క్రమంలో రాష్ట్రప్రభుత్వం చర్యలు చేపట్టింది. 25నుంచి ఐదురోజుల పాటు పాఠశాలలను మూసివేస్తున్నట్టు ప్రకటించింది. కటక్, ఖుర్దా, ఆంగూల్, సబర్నపూర్, బౌద్, నయాగర్ వంటి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉన్నాయి. అవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలని అధికారులు ప్రజలను కోరుతున్నారు. ప్రచండభానుడి తాపానికి పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో చెప్పే విధంగా తాజాగా.. ఓ వీడియో వెలుగులోకి వచ్చింది.
ఓ మహిళ.. స్టవ్ లేకుండానే, మండుటెండలో నిలిపిన కారు బానెట్పై చపాతీలు చేసేసింది! ఒడిశా సోనిపూర్ జిల్లాలో జరిగింది ఈ ఘటన. నిలా మధబ్ పాండే అనే ఓ సినీ నిర్మాత.. ఈ నెల 25న ఈ వీడియోను ట్వీట్ చేశారు. 'నా సోనిపూర్లోని దృశ్యాలు ఇవి. ఎండలు ఎలా ఉన్నాయంటే.. కారు బానెట్పై చపాతీలు చేసేయవచ్చు,' అని క్యాప్షన్ ఇచ్చారు. వీడియోలో.. ఓ కారు కనిపిస్తుంది. ఇద్దరు మహిళలు కారు వద్ద నిలబడి ఉన్నారు. ఓ మహిళ.. పిండి తీసుకుని చపాతీలు చేయడం మొదలుపెట్టింది. ఆ తర్వాత.. దానిని కారు బానెట్పై పెట్టింది.
స్టవ్ మీద చేసే విధంగానే గరిట పట్టుకుని చపాతీని కిందికి, పైకి తిప్పింది. కొన్ని నిమిషాల తర్వాత.. చపాతీ తయారైపోవడం గమనార్హం. ఈ వీడియోపై నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు. ఆ దృశ్యాలను చూసి షాక్ అవుతున్నారు. 'వామ్మో ఎండలు', 'బయటకు వెళ్లకండి బాబోయ్' అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికోందరు మాత్రం గతంలో కొడిగుడ్లు అమ్లేటు అయ్యేవి.. కానీ ఇప్పుడు ఏకంగా చపాతీలే తయారవుతున్నాయ్.. ఇక మున్ముందు ఏమవుతుందో అంటూ అందోళన వ్యక్తం చేశారు. ఇక కొందరు మాత్రం ఏసీలకు అయ్యే బిల్లును గ్యాస్ రూపంలో పోదుపు చేస్తున్నారా.? అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Scenes from my town Sonepur. It’s so hot that one can make roti on the car Bonnet @NEWS7Odia #heatwaveinindia #Heatwave #Odisha pic.twitter.com/E2nwUwJ1Ub
— NILAMADHAB PANDA ନୀଳମାଧବ ପଣ୍ଡା (@nilamadhabpanda) April 25, 2022
(And get your daily news straight to your inbox)
Aug 19 | దేశవ్యాప్తంగా పలు కేసులకు సంబంధించి వివిధ రాష్ట్రాల్లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ దాడులన్నీ రాజకీయ కక్ష సాధింపులో బాగంగానే కొనసాగుతున్నాయిని విపక్షాలన్నీ ఏకపక్షంగా... Read more
Aug 19 | త్వరలో భారత్లో 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. 5G వచ్చిన తర్వాత దేశంలో ఇంటర్నెట్ కనెక్టివిటీ మరింత మెరుగవుతుంది. దీంతో రాబోయే కాలంలో డిజిటల్ మార్కెటింగ్ పరిధి మరింత పెరుగుతుందని, ఈ రంగంలో ఉద్యోగాల... Read more
Aug 19 | భారతీయ స్టేట్ బ్యాంక్.. దేశంలోనే కాదు ఏకంగా ఆసియా ఖండంలోనే అతిపెద్ద బ్యాంక్ ఇది. ఈ బ్యాంకులో దొంగలు పడ్డారు. అయితే పడింది మాత్రం బయటి దొంగలు కాదు. ఏకంగా ఇంటి దొంగలే. అయితే... Read more
Aug 18 | పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్తున్నప్పుడు అప్పుడప్పుడూ సరదా సంఘటనలు జరుగుతుంటాయి. చిన్నచిన్న కారణాలకే కొందరు గొడవ పడుతుంటారు. ఆ సీటు నాది అని.. కొంచెం అలా జరగాలని ఇలా పలు చిన్న కారణాలే కానీ.. ఆ... Read more
Aug 18 | హైదరాబాద్ నుంచి బెంగళూరు మధ్య రైలు ప్రయాణానికి పది గంటలు లేదా 11 గంటలు పడుతుంది. ఇకపై కేవలం రెండున్నర గంటల్లోనే బెంగళూరుకు వెళ్లొచ్చు. దేశంలోనే అత్యంత వేగంగా దూసుకుపోతున్న ఐటీ హాబ్ కేంద్రాలు... Read more