ఈ మధ్యకాలంలో పెళ్లిళ్లకు సంబంధించిన అనేక విషయాలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. పెళ్లిళ్లో వధూవరులకు సంబంధించిన అంశాలతో పాటు వారి బంధవులు, కుటుంబ సభ్యులకు సంబంధించిన వార్తలు హాట్ టాపిక్ గా నిలుస్తున్నాయి. అలాంటిదే ఈ పెళ్లి కూడా. తాజాగా ఈ పెళ్లికి సంబంధించిన వార్త కూడా నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇక్కడ పెళ్లి కోసం ఏర్పాట్లన్నీ సిద్ధమయ్యాయి. పెళ్లి కొడుకు కుటుంబసభ్యులు, బందువులతో పాటు బరాత్ ఊరేగింపులో ఘనంగా మండపానికి చేరుకున్నాడు.
పెళ్లి కూతురు కూడా బంధు, మిత్రుల సమేతంగా మండపానికి చేరుకుంది. మరికొన్ని క్షణాల్లో కళ్యాణ కమనీయంగా సాగుతుంది అనగా ట్విస్ట్ ఏర్పడింది. ఈ సమయంలోనే అక్కడికి పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో వధూవరులు పెళ్లి పీటలపై నుంచి పారిపోయారు. ఆ తర్వాత పోలీసులు వరుడి తండ్రితో పాటు సోదరుడిని అరెస్టు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 20న మన్సుఖ్పురాలోని కర్కౌలి గ్రామంలో పెళ్లికి వైభవోపేతంగా ఏర్పాట్లు చేశారు.
వరుడు బ్యాండ్ మేళంతో ఊరేగింపుగా బంధువులతో కలిసి వధువు ఇంటికి చేరుకున్నాడు. ఈ క్రమంలో యువతి మైనర్ అంటూ గ్రామస్తుడు ఒకరు మన్సుఖ్పురా పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో స్టేషన్ ఇన్చార్జి గిరీష్కుమార్ పోలీసు బలగాలతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దీంతో పోలీసులను చూడగానే బంధువులంతా ఖంగుతిన్నారు. పోలీసులను చూసిన తర్వాత వధూవరులు భయపడి పీటల మీద నుంచి పొలాల వైపు పారిపోయారు. ఆ తర్వాత బంధువులు సైతం వివాహ వేదిక నుంచి ఎవరి ఇండ్లకు వారు వెళ్లిపోయారు.
వరుడు మధ్యప్రదేశ్లోని మోరెనా జిల్లాలోని నయాపుర అంబాహ్ అని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత వరుడి తండ్రి, సోదరుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్స్టేషన్లో విచారించారు. బాలిక వయసుకు సంబంధించిన పత్రాలతో రావాలని సూచించినట్లు ఎస్హెచ్ఓ తెలిపారు. మైనర్కు వివాహం జరిపించినట్లయితే నిందితులందరిపై చర్యలుంటాయని ఎస్హెచ్ఓ హెచ్చరించారు. ఇదిలా ఉండగా.. వరుడు గత 15 రోజుల కిందట పొరుగున ఉన్న బంధువులపై వేధింపులకు పాల్పడగా.. కేసు నమోదైనట్లు పోలీసులు పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more