దేశంలో కొవిడ్ కొత్త వేరియంట్ పుట్టుకొచ్చిందన్న వార్త తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. ఒమిక్రాన్కు చెందిన బీఏ.2.12.1 వేరియంట్.. ఢిల్లీలో వెలుగులోకి వచ్చినట్టు సమాచారం. ఈ వేరియంట్ వల్లే ఢిల్లీలో కొవిడ్ కేసులు దారుణంగా పెరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఉన్న బీఏ.2 కన్నా దీని తీవ్రత ఎక్కువ అని, ప్రజల్లో ఎక్కువగా వ్యాపించే శక్తి దీనికి ఉన్నట్టు తెలుస్తోంది. బీఏ.2 కన్నా ఈ కొత్త వేరియంట్ డబ్లింగ్ రేటు 2.5రెట్లు అధికంగా ఉందని వెల్లడించారు.
ఢిల్లీలో గత కొన్ని రోజులుగా 1000కిపైగా కేసులు నమోదవుతున్నాయి. అయితే దాదాపు 8 కొవిడ్ వేరియంట్లు ఢిల్లీలో ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. వీటిల్లో ఒమిక్రాన్, దాని ఉప వేరియంట్లు కూడా ఉన్నాయి. కాగా ఈ ఎనిమిది వేరియంట్లలో ఒకదాని వల్లే కేసులు భారీ మొత్తంలో పెరుగుతున్నట్టు భావిస్తున్నారు. అందువల్ల దానిని కనుగొనే పనిలోపడ్డారు."ఢిల్లీలో కొత్త వేరియంట్ బయటకొచ్చినట్టు అనిపిస్తోంది. రోగుల నమూనాలను సీక్వెన్సింగ్ చేశాము, త్వరలో దీనిపై స్పష్టత లభిస్తుంది," అని ఐఎల్బీఎస్ డైరక్టర్ డా. ఎస్కే సారిన్ మీడియాకు వెల్లడించారు.
ఈ పరిణామాల మధ్య కొవిడ్ నాలుగో వేవ్ భయాలు ప్రజల్లో మొదలయ్యాయి. కొత్త వేరియంట్లు రాకపోతే నాలుగో వేవ్ వచ్చే అవకాశం లేదని నిపుణులు ఇప్పటికే స్పష్టం చేశారు. కానీ ఈ పరిస్థితుల్లో ఢిల్లీ వైద్యుల మాటలు సర్వత్రా ఆందోళన కలిగిస్తున్నాయి. కొత్త వేరియంట్ భయాల మధ్య దేశంలో కరోనా కేసులు భారీస్థాయిలో పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కొత్తగా 2,451మందికి వైరస్ సోకింది. క్రితం రోజుతో పోల్చుకుంటే ఇది ఎక్కువ. కొవిడ్కు 54మంది బలయ్యారు. రోజువారీ పాజిటివిటీ రేటు 05.శాతంగా ఉంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more