నషాముక్త్ హైదరాబాద్ గా నగరాన్ని తీర్చిదిద్దాలని భావిస్తున్న పోలీసులు బంజారాహిల్స్ ర్యాడిసన్ హోటల్ పై దాడి చేయగా, అందులో సినీ, రాజకీయ, వ్యాపార వర్గాలకు చెందిన ఎంతోమంది ప్రముఖులు, సెలబ్రిటీలు, వారి సంతానం ఉండటంతో ఈ వార్త రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. అయితే ఈ పబ్ పై ఇతర పబ్ కు చెందిన సభ్యుల నుంచి పిర్యాదులు వెలువడిన నేపథ్యంలోనే టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారన్న వార్త కూడా బయటకు వచ్చింది. అయితే ఈ కేసులో ఇప్పటికే ముగ్గరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మరో ఇద్దరి కోసం వెతుకుతున్నారన్న విషయం కూడా తెలిసిందే.
ఈ వ్యవహారంలో మాదకద్రవ్యాలు తీసుకున్న వారిని ప్రాథమికంగా గుర్తించిన పోలీసులు.. పబ్ లోని సీసిటీవీ ఫూటేజీతో పాటు నిర్వాహకుల నుంచి విచారణలో రాబట్టిన సమాచారంతో మొత్తంగా ఆ రోజు రాత్రి ఫుడ్డింగ్ అండ్ మింట్ ఫబ్ లో ఏకంగా 20 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు సమాచారం సేకరించారు. ఇక త్వరలోనే వీరికి తాఖీదులు కూడా పంపనున్నారు. పబ్ మేనేజర్ అనిల్ తో పాటు అభిషేక్ కనుసన్నల్లోనే డ్రగ్స్ సరఫరా అయిందని పోలీసులు అనుమానిస్తున్నారు. అభిషేక్ కాంటాక్ట్ లిస్ట్ గోవా ముంబై కి చెందిన కొంతమంది వ్యక్తులతో లింకులు వున్నాయని పోలీసులు సమాచారం రాబట్టారు. వీరిలో గతంలో డ్రగ్స్ తో పట్టుబడిన పెడ్లర్స్ కూడా ఉన్నారని తెలుసుకున్న పోలీసలు వారిని విచారించేందుకు కోర్టులో పిటీషన్ వేశారు.
ఈ పిటీషన్ పై ఇవాళ విచారించిన నాంపల్లి కోర్టు.. ఫుడింగ్ పబ్ కేసులో నిందితులను పోలీస్ కస్టడీకి ఇచ్చేందుకు అనుమతి ఇచ్చింది. కోర్టు అనుమతితో నాలుగు రోజుల పాటు నిందితులను అదుపులోకి తీసుకొని విచారించనున్నారు. ప్రస్తుతం ఇద్దరు చంచల్గూడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. కోర్టు అనుమతి నేపథ్యంలో అనిల్ ఇద్దరిని బంజారాహిల్స్ పోలీసులు ప్రశ్నించనున్నారు. అదే రోజున వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టులో హాజరుపర్చాగా.. వీరిద్దరికి న్యాయస్థానం 14 రోజుల పాటు రిమాండ్ను విధించింది. బంజారాహిల్స్ పోలీసులు కస్టడీ పిటీషన్ పై ఇవాళ విచారించిన కోర్టులో నాలుగు రోజులు కస్టడీకి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more