భారతీయ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ( ఐఆర్సీటీసీ ) గుడ్ న్యూస్ చెప్పింది. తమ రైళ్లలో ప్రయాణించే చైత్రనవరాత్రుల భక్తులకు ఎలాంటి ఆటంకల లేకుండా వారికి కావాల్సిన విధంగా బోజనం అందుబాటులోకి తీసుకురానుంది. వీటితో పాటు తాజా పండ్ల రసాలు.. పాల ఉత్పత్తులు, డ్రైఫూట్స్ నట్స్ సహా పలువిధాల ఆహారం అందుబాటులోకి తీసుకురానుంది. ఏప్రిల్ 2 నుండి చైత్ర నవరాత్రులు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. నవరాత్రి సందర్భంగా, రైల్వేలో ప్రయాణించే భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు కొత్త సౌకర్యాన్ని ప్రారంభించింది . నవరాత్రులలో ఉపవాసం ఉండే ప్రయాణికులు ఇప్పుడు రైలులో ఇష్టమైన ఆహారాన్ని ఆర్డర్ చేయవచ్చు. ఏప్రిల్ 2 నుండి IRCTC ఈ సదుపాయాన్ని ప్రారంభించనుంది .
ఈ సదుపాయం కింద ప్రయాణికులు లస్సీ, తాజా పండ్ల రసం, పండ్లు, టీ, పాల ఉత్పత్తులు, డ్రైఫ్రూట్ పుడ్డింగ్ వంటి ఆహార పదార్థాలను ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ ప్రత్యేక భోజనంలో ఉల్లిపాయ-వెల్లుల్లి ఉండదు. రుచికరమైన, స్వచ్ఛమైన భోజనాన్ని అందించనున్నారు. సాదా ఉప్పుకు మబదులుగా సందవ్ ఉప్పును భోజనంలో ఉపయోగిస్తారు. అయితే ఈ ఫుడ్ డెలవరికి ముందుగానే బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రయాణీకులు ముందుగా ఈ-కేటరింగ్ లేదా 1323కి కాల్ చేసి ఆర్డర్ బుక్ చేసుకోవాలి. ఆర్డర్లు బుక్ చేసిన రెండు గంటల తర్వాత ప్రయాణీకుల సీటుకు ఫుడ్ డెలివరీ చేయబడతుంది. 300 రైళ్లలో ఈ సౌకర్యం ఉంటుంది. ప్రయాణికులు ఈ ఫాస్టింగ్ ప్లేట్ కోసం రూ.99 నుంచి రూ.250 వరకు వెచ్చించాల్సి ఉంటుందని IRCTC ప్రతినిధి ఆనంద్ ఝా తెలిపారు.
ఈ థాలీలో ప్రయాణికులు పొందే ఆహార పదార్థాలు ఇవే:
* ఆలూ చాప్
* సాబుదాన టిక్కీ
* పనీర్ మఖ్మాలి
* సబుదాన ఖిచ్డీ నవరాత్రి థాలీ
* సింగ్దానా ఆలూ పరాఠా
* అర్బీ మసాలా
* కోఫ్తా కూర
* పెరుగుతో సబుదానా ఖిచ్డీ
* సీతాఫల్ ఖీర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more