అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి దొంగతనం చేసేందుకు ప్రయత్నించిన దోపిడీ దొంగలను సివంగిలా ఎదిరించింది గుజరాత్ సూరత్కు చెందిన 20 ఏళ్ల యువతి. ముగ్గురు దుండగులను ఒంటి చేత్తో నిలువరించింది. తనతో పాటు చెల్లి, అమ్మకు దొంగల నుంచి ఎలాంటి హాని లేకుండా కాపాడుకుంది. ఈ యువతి ధైర్యాన్ని చూసి బెంబేలెత్తిన ఆగంతుకులు పారిపోయారు. అయితే వారిని ఎదిరించే క్రమంలో యువతి చేతికి పెద్ద గాయమైంది. మొత్తం 24 కుట్లు పడ్డాయి.
మహారాష్ట్రకు చెందిన బాబూరాం కాశీనాథ్ కుటుంబం సూరత్లోని పల్సానా తాలుగా ఛల్తానా గ్రామంలో రైల్వే గేట్ సమీపంలో నివాసముంటోంది. మిల్లులో పనిచేస్తున్న అతనికి మంగళవారం నైట్ డ్యూటీ పడింది. దీంతో భార్య భారతీబెన్, కూతుళ్లు రియా, రిచా ఇంట్లో జాగ్రత్తగా ఉండాలని చెప్పి అతడు మిల్లుకు వెళ్లాడు. అయితే ఇదే అదునుగా భావించిన దొంగలు దోపిడీకి ప్రయత్నించారు. రాత్రి 1:30 గంటలకు కరెంట్ పోగానే తలుపు గడియ పగలగొట్టి ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. అయితే వార్షిక పరీక్షల కోసం సన్నద్ధవుతున్న రియా ఆ సమయంలో చదువుకుంటోంది.
కరెంటు పోయినా మెలకువతోనే ఉండటంవల్ల దొంగలు ఇంట్లోకి వస్తున్నారని గమనించింది. వారి వద్ద ఆయుధాలు ఉన్నా ధైర్యంగా పోరాడింది. మొదట ఓదొంగను నిలువరించిగా.. ఆ తర్వాత మరో ఇద్దరు దొంగలు ఇంట్లోకి వచ్చారు. అందులో ఒకరు తన చెల్లి వైపు వెళ్తుండగా.. రియా బిగ్గరగా అరిచింది. దీంతో రిచాతో పాటు తల్లి భారతీబెన్ కూడా లేచింది. ఇంతలోనే కరెంటు వచ్చింది. దీంతో దొంగలు ఇంటి నుంచి పరారయ్యారు. అయితే వారితో పోరాడే క్రమంలో అతని వద్ద ఉన్న ఆయుధం వల్ల రియా చేతికి పెద్ద గాయమైంది. ఆస్పత్రికి వెళ్లగా 24 కుట్లు పడ్డాయి.
Surat News: రియా స్థానిక కాలేజీలో బీఎస్సీ చదువుతోంది. కళాశాలలో సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇవ్వడం ఆమెకు నిజ జీవితంలో చాలా ఉపయోగపడింది. ముగ్గురు దొంగలతో భయం లేకుండా పోరాడిన రియా ధైర్య సాహసాలను గ్రామస్థులు ప్రశంసించారు. ఘటన జరిగిన మరునాడు పోలీసులు వచ్చి కేసు నమోదు చేశారు. దుండగులను గుర్తించేందుకు దర్యాప్తు చేపట్టారు. రియా పోరాటపటిమను కొనియాడారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more