Sri Lanka cancels school exams over paper shortage శ్రీలంకలో అధ్యక్షభవనం చుట్టుముట్టిన అందోళనకారులు

Sri lanka cancels school examinations due to paper shortage amid financial crisis

sri lanka, president, Economic crisis, Price increase, Inflation, President residence, protesters attack, colombo, 144 section, SriLankan Army, international monetary fund, imf, china, beijing, gotabaya rajapaksa, international monetary fund, economic crisis, food crisis

Sri Lanka cancelled exams for millions of school students as the country ran out of printing paper with Colombo short on dollars to finance imports, officials said. Education authorities said the term tests, scheduled a week from Monday, were postponed indefinitely due to an acute paper shortage as Sri Lanka contends with its worst financial crisis since independence in 1948.

శ్రీలంకలో తీవ్రఆర్థిక సంక్షోభం.. అధ్యక్షభవనం చుట్టుముట్టిన అందోళనకారులు

Posted: 04/01/2022 03:58 PM IST
Sri lanka cancels school examinations due to paper shortage amid financial crisis

శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తీవ్రస్థాయికి చేరింది. ఇప్పటికే ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టుతున్నారు. చికెన్‌, బియ్యం, ఉల్లిపాయలు సహా నిత్యావసరాల ధరలు అన్నీ అకాశానంటుతున్నాయి. గ్యాస్‌ ధరలు అందుకోలేని స్థాయికి చేరాయి. దీంతో దేశంలోని 90 శాతం హోటళ్లు మూతపడ్డాయి. ఇక అత్యంత ముఖ్యమైన ఇంధన ధరలు కూడా ఈ ప్రభావానికి గురవుతున్నాయి. ఓ వైపు ఇంధన ధరలు కూడా ఆశాకాన్ని అంటడంతో ప్రజలు తప్పనిసరి అయితేనే వాహనాలను సొంత వినియోగిస్తున్నారు. 1990 సంక్షోభం కంటే మరింత దారుణమైన పరిస్థితులు శ్రీలంకలో ఉన్నట్లు ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తీవ్ర ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో శ్రీలంకలోని ప్రజలు అల్లాడిపోతున్నారు. ఏం కొనేట్టు లేదు, ఏం తినేట్టు లేదంటూ తమ తమ నిరసనను ప్రభుత్వానికి తెలుపుతున్నారు. పెట్రోల్, డీజిల్ దొరకడం లేదు. ఇంధన కోసం కూడా ప్రజలు బారులు తీరాల్సివచ్చింది. ఇక విద్యుత్ గ్రామీణ ప్రాంతంలో లేనేలేదు. అయితే నగరాల్లో మాత్రం రోజుకు 13 గంటల విద్యుత్ కోతలు అమలవుతున్నాయి. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి. నీళ్లు కూడా బ్లాక్ లో కొనుక్కోవాల్సిన దుర్భర పరిస్థితి. పేపర్ కొరతతో విద్యార్థుల పరీక్షలను కూడా వాయిదా వేశారంటే ఆ దేశ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

సరుకులకోసం జనాలు దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఈ పరిస్థితుల నుంచి తప్పించుకుని తమ కుటుంబలతో కొందరు దేశం దాటిపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది. నిన్న అర్ధరాత్రి కొలంబోలోని అధ్యక్ష భవనాన్ని వేలాది మంది ప్రజలు చుట్టుముట్టారు. అధ్యక్ష భవనం ముందు నిరసన కార్యక్రమాలను చేపట్టారు. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఒకానోక సందర్భంగా నిరసనకారులు ఆగ్రహం కట్టలు తెచ్చుకుని దిక్కులు పెక్కుటిల్లేలా నినాదాలు చేశారు.దాదాపు 5 వేల మంది నిరసన కార్యక్రమంలో పాల్గొన్నట్టు సమాచారం. మరోవైపు నిరసనకారులను పోలీసులు నిలువరించే ప్రయత్నం చేశారు.

అందోళన నిర్వహిస్తున్న సమయంలో నిరసనకారులకు.. పోలీసులకు మధ్య పరిస్థితి చేయి దాటి హింసాత్మకంగా మారింది. పోలీసుల మీదకు నిరసనకారులు రాళ్లు, బాటిళ్లు విసిరారు. దీంతో, టియర్ గ్యాస్, జల ఫిరంగులను పోలీసులు ప్రయోగించారు. ఈ క్రమంలో, నిరసనకారులు మరింత రెచ్చిపోయారు. పోలీసుల వాహనాలను ధ్వంసం చేశారు. పలు వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ నేపథ్యంలో, శ్రీలంక ప్రభుత్వం కొలంబోలో 144 సెక్షన్ విధించింది. సైన్యాన్ని రంగంలోకి దించింది. మరోవైపు నిరసనకారులు ఆందోళన చేస్తున్న సమయంలో అధ్యక్షుడు గొటబాయ రాజపక్స అధ్యక్ష భవనంలో లేరని సమాచారం. ఆయన రహస్య ప్రాంతంలో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

ఈ ఘటనలో అద్యక్షభవనంలోకి దూసుకుపోయేందుకు ప్రయత్నించినట్లు అనుమానిస్తున్న 45 మంది నిరసనకారుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఒక పోలీసు అధికారి మాట్లాడుతూ, పోలీసులు అడ్డుకుని ఉండకపోతే అధ్యక్ష భవనంపై దాడి జరిగేదని అన్నారు. ఏదేమైనప్పటికీ ఎంతో ప్రశాంతంగా ఉండే శ్రీలంక ఇప్పుడు రణభూమిని తలపిస్తోంది. తినడానికి తిండి దొరకని పరిస్థితుల్లో ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. ఏ క్షణంలోనైనా అక్కడి పరిస్థితులు పూర్తిగా దిగజారే అవకాశాలు ఉన్నట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ద్వీప దేశమైన శ్రీలంక అర్థిక సంక్షోభానికి కారణం మాత్రం కరోనా మహమ్మారే. చుట్టూ సముద్రం, బీచ్ లు, దట్టమైన అడవులు, అందమైన ప్రకృతితో అలరారుతుండే లంకకు ప్రధాన ఆదాయవనరు పర్యాటకమే. అయితే కరోనా కారణంగా టూరిస్టులు రాకపోవడంతో ఆదాయం పూర్తిగా పడిపోయింది. దీనికితోడు దిగుమతుల్ని నిషేధిస్తూ లంక ప్రభుత్వం 2020లో తీసుకున్న నిర్ణయం శరాఘాతంగా మారింది. విదేశీ మారకద్రవ్యాన్ని పొదుపు చేసి, 51 బిలియన్ డాలర్ల అప్పులను తీర్చాలని ఆ దేశ ప్రభుత్వం ఆలోచించింది. కాగా ఈ సంక్షోభ సమయంలోనైనా దిగుమతులకు అనుమతించకుండా ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. ఈ గడ్డు పరిస్థితి నుంచి ఎలాగట్టెక్కాలో అర్థంకాక పాలకులు తలలు పట్టుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles