శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తీవ్రస్థాయికి చేరింది. ఇప్పటికే ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టుతున్నారు. చికెన్, బియ్యం, ఉల్లిపాయలు సహా నిత్యావసరాల ధరలు అన్నీ అకాశానంటుతున్నాయి. గ్యాస్ ధరలు అందుకోలేని స్థాయికి చేరాయి. దీంతో దేశంలోని 90 శాతం హోటళ్లు మూతపడ్డాయి. ఇక అత్యంత ముఖ్యమైన ఇంధన ధరలు కూడా ఈ ప్రభావానికి గురవుతున్నాయి. ఓ వైపు ఇంధన ధరలు కూడా ఆశాకాన్ని అంటడంతో ప్రజలు తప్పనిసరి అయితేనే వాహనాలను సొంత వినియోగిస్తున్నారు. 1990 సంక్షోభం కంటే మరింత దారుణమైన పరిస్థితులు శ్రీలంకలో ఉన్నట్లు ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తీవ్ర ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో శ్రీలంకలోని ప్రజలు అల్లాడిపోతున్నారు. ఏం కొనేట్టు లేదు, ఏం తినేట్టు లేదంటూ తమ తమ నిరసనను ప్రభుత్వానికి తెలుపుతున్నారు. పెట్రోల్, డీజిల్ దొరకడం లేదు. ఇంధన కోసం కూడా ప్రజలు బారులు తీరాల్సివచ్చింది. ఇక విద్యుత్ గ్రామీణ ప్రాంతంలో లేనేలేదు. అయితే నగరాల్లో మాత్రం రోజుకు 13 గంటల విద్యుత్ కోతలు అమలవుతున్నాయి. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి. నీళ్లు కూడా బ్లాక్ లో కొనుక్కోవాల్సిన దుర్భర పరిస్థితి. పేపర్ కొరతతో విద్యార్థుల పరీక్షలను కూడా వాయిదా వేశారంటే ఆ దేశ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
సరుకులకోసం జనాలు దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఈ పరిస్థితుల నుంచి తప్పించుకుని తమ కుటుంబలతో కొందరు దేశం దాటిపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది. నిన్న అర్ధరాత్రి కొలంబోలోని అధ్యక్ష భవనాన్ని వేలాది మంది ప్రజలు చుట్టుముట్టారు. అధ్యక్ష భవనం ముందు నిరసన కార్యక్రమాలను చేపట్టారు. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఒకానోక సందర్భంగా నిరసనకారులు ఆగ్రహం కట్టలు తెచ్చుకుని దిక్కులు పెక్కుటిల్లేలా నినాదాలు చేశారు.దాదాపు 5 వేల మంది నిరసన కార్యక్రమంలో పాల్గొన్నట్టు సమాచారం. మరోవైపు నిరసనకారులను పోలీసులు నిలువరించే ప్రయత్నం చేశారు.
అందోళన నిర్వహిస్తున్న సమయంలో నిరసనకారులకు.. పోలీసులకు మధ్య పరిస్థితి చేయి దాటి హింసాత్మకంగా మారింది. పోలీసుల మీదకు నిరసనకారులు రాళ్లు, బాటిళ్లు విసిరారు. దీంతో, టియర్ గ్యాస్, జల ఫిరంగులను పోలీసులు ప్రయోగించారు. ఈ క్రమంలో, నిరసనకారులు మరింత రెచ్చిపోయారు. పోలీసుల వాహనాలను ధ్వంసం చేశారు. పలు వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ నేపథ్యంలో, శ్రీలంక ప్రభుత్వం కొలంబోలో 144 సెక్షన్ విధించింది. సైన్యాన్ని రంగంలోకి దించింది. మరోవైపు నిరసనకారులు ఆందోళన చేస్తున్న సమయంలో అధ్యక్షుడు గొటబాయ రాజపక్స అధ్యక్ష భవనంలో లేరని సమాచారం. ఆయన రహస్య ప్రాంతంలో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
ఈ ఘటనలో అద్యక్షభవనంలోకి దూసుకుపోయేందుకు ప్రయత్నించినట్లు అనుమానిస్తున్న 45 మంది నిరసనకారుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఒక పోలీసు అధికారి మాట్లాడుతూ, పోలీసులు అడ్డుకుని ఉండకపోతే అధ్యక్ష భవనంపై దాడి జరిగేదని అన్నారు. ఏదేమైనప్పటికీ ఎంతో ప్రశాంతంగా ఉండే శ్రీలంక ఇప్పుడు రణభూమిని తలపిస్తోంది. తినడానికి తిండి దొరకని పరిస్థితుల్లో ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. ఏ క్షణంలోనైనా అక్కడి పరిస్థితులు పూర్తిగా దిగజారే అవకాశాలు ఉన్నట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ద్వీప దేశమైన శ్రీలంక అర్థిక సంక్షోభానికి కారణం మాత్రం కరోనా మహమ్మారే. చుట్టూ సముద్రం, బీచ్ లు, దట్టమైన అడవులు, అందమైన ప్రకృతితో అలరారుతుండే లంకకు ప్రధాన ఆదాయవనరు పర్యాటకమే. అయితే కరోనా కారణంగా టూరిస్టులు రాకపోవడంతో ఆదాయం పూర్తిగా పడిపోయింది. దీనికితోడు దిగుమతుల్ని నిషేధిస్తూ లంక ప్రభుత్వం 2020లో తీసుకున్న నిర్ణయం శరాఘాతంగా మారింది. విదేశీ మారకద్రవ్యాన్ని పొదుపు చేసి, 51 బిలియన్ డాలర్ల అప్పులను తీర్చాలని ఆ దేశ ప్రభుత్వం ఆలోచించింది. కాగా ఈ సంక్షోభ సమయంలోనైనా దిగుమతులకు అనుమతించకుండా ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. ఈ గడ్డు పరిస్థితి నుంచి ఎలాగట్టెక్కాలో అర్థంకాక పాలకులు తలలు పట్టుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more