ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నగరా మ్రోగడంతో పాటు మరి కొన్ని రోజుల వ్యవధిలో తొలి విడత ఎన్నికలకు కూడా రంగం సిద్దమైనా.. రాష్ట్రంలో మాత్రం అత్యాచారాల పర్వం కొనసాగుతూనే వున్నాయి. దళిత మహిళలు, యువతులపై జరుగుతున్న అత్యాచార ఘటనలను వ్యతిరేకించడంతో పాటు బాధిత కుటుంబాలకు తగు న్యాయం జరగాలని డిమాండ్ తో పాటు మహిళలకు, యువతులకు అండగా నిలుస్తామని ఎన్నికల రణక్షేత్రంలో బరిలో అదే ప్రచారాస్త్రాంగా చేసుకన్నా.. అత్యాచార ఘటనలు మాత్రం అగడం లేదు. హత్రాస్ హృదయ విదారక ఘటనలో దోషులకు శిక్ష పడక ముందే.. బులంద్ షహర్లో అచ్చం అదే తరహాలో మరో కేసు ఒకటి వెలుగు చూసింది.
పొలం పనులకు వెళ్లిన ఓ బాలికపై కొందరు సామూహిక లైంగిక దాడికి పాల్పడి దారుణంగా హత్య చేశారు. అదే రాత్రి పోలీసులు ఆమె కుటుంబసభ్యులను బెదిరించి మృతదేహాన్ని ఖననం చేపించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటన జనవరి 21 న జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బులంద్షహర్-అలీఘర్ సరిహద్దులోని దిబాయి-ఘలిబ్పూర్ గ్రామంలో ఈ ఘటన జనవరి 21 న జరిగింది. ధోరౌ గ్రామానికి చెందిన నలుగురు సదరు బాలికను బలవంతంగా ఎత్తుకెళ్లి లైంగికదాడి జరిపి, అనంతరం తుపాకీతో కాల్చి చంపారు. ఆమె కుటుంబసభ్యులకు స్థానిక పోలీసులు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు.
ఘర్షణ పెంచుకోవడం వల్ల ఇబ్బందులు వస్తాయని, వెంటనే దహనం చేయాలంటూ తమపై పోలీసులు ఒత్తిడి తీసుకురావడంతో అదే రోజు రాత్రి కాల్చివేసినట్లు బాధితురాలి కుటుంబీకులు చెప్పారు. అయితే, స్థానిక పోలీసులు, అధికారులు బెదిరింపులకు పాల్పడి కేసు బయటకు రాకుండా అణగదొక్కారు. ప్రేమ వ్యవహారంలో అమ్మాయి హత్యకు గురైందని పత్రికలకు కథనం కూడా చెప్పించారు. బాలుడు కూడా ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లుగా నమ్మించారు. నిందితులను పోలీసులు కాపాడుతున్నారంటూ బాధితురాలి గ్రామస్థులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠియించారు. కాగా, పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more