ఇంధన ధరలు అంతకంతకూ పెరుగుతూ ఏకంగా వంద రూపాయల మర్కును ధాటిన నేపథ్యంలో అనునిత్యం వాహనాలపై తిరిగి వ్యవహారాలను చక్కబెట్టుకునే వారి నుంచి డబ్బులను పోదుపు చేయాలని భావిస్తున్నవారందరూ తాజాగా అందుబాటులోకి వచ్చిన ఎలక్ట్రిక్ వాహనాలతో తమ పనులు చక్కబెట్టుకుంటున్నారు. అయితే ఇటీవల హైదరాబాదులోని ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ నుంచి దట్టమైన పోగలు వచ్చి ఆ వెంటనే మంటలు ఎగసిపడిన ఘటన తెలిసిందే. ఆ తరువాత దేశరాజధాని ఢిల్లీలోని గురుగ్రామ్ లో ఓ ఈవీ స్కూటర్ బ్యాటరీ పేలడంతో ఇంట్లోని 60 ఏళ్ల వ్యక్తి మరణించగా, అకస్మాత్తుగా అంటుకున్న మంటలలో చిక్కుకున్న నలుగురు కుటుంబసభ్యులు గాయాలపాలైన ఘటన కూడా తెలిసిందే.
అయితే ఇవేదో యాధృశ్చికంగా జరిగిన ఘటనలు అని తోసిరాజుతున్న తరుణంలో కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలో మరో ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ చార్జీంగ్ పెట్టిన క్రమంలో పేలిపోయింది. అకస్మాత్తుగా వ్యాపించిన మంటలతో ఆ గదిలోని వస్తువులన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. కుత్బుల్లాపూర్ పరిధిలోని చింతల్ భగత్సింగ్ నగర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ ఎలక్ట్రిక్ స్కూటీ బ్యాటరీ చార్జింగ్ పెట్టగా అర్థారాత్రి సమయంలో అకస్మాత్తుగా పేలిపోయింది. బ్యాటరీ పేలిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళ్తే.. భగత్సింగ్ నగరకు చెందిన సాయికుమార్ రెడ్డి అనే వ్యక్తి ఇటీవలే ఓ ఎలక్ట్రిక్ స్కూటీని కిరాయికి తీసుకున్నాడు.
ప్రతి రోజు రూ. 150 చెల్లించి ఆ స్కూటీని సాయి నడుపుకుంటున్నాడు. అయితే మంగళవారం రాత్రి తన ఇంట్లోని ఓ గదిలో స్కూటీకి ఛార్జింగ్ పెట్టి నిద్రలోకి జారుకున్నాడు. బుధవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఏవో విద్యుత్ తీగలు కాలినట్లు వాసన రావడంతో సాయికి మేలకువ వచ్చింది. ఆయన లేచి పక్క గదిలోని స్విచ్ను ఆన్ చేసేలోపే స్కూటీ బ్యాటరీ పేలిపోయింది. దీంతో మంటలు ఎగిసిపడ్డాయి. ఆ ఇంట్లోని సామాగ్రి కాలి బూడిదైంది. అప్రమత్తమైన స్థానికులు కిటికీల నుంచి నీళ్లు చల్లి మంటలను అదుపు చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బ్యాటరీ పేలిన సమయంలో ఆ గదిలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more