గర్భిణీ మహిళా అభ్యర్థులకు సంబంధించి దేశ అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తెచ్చిన తాజా నిబంధనలు విమర్శలకు దారితీస్తున్నాయి. మూడు నెలలకు మించి గర్భంతో ఉన్న మహిళలు ఉద్యోగంలో చేరేందుకు తాత్కాలికంగా అనర్హులంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. గర్భధారణకు సంబంధించిన సవరణ గతంలో మార్గదర్శకత్వాన్నికి పూర్తి భిన్నంగా ఉంది. గతంలో గర్భం దాల్చిన ఆరు నెలల వరకు మహిళా అభ్యర్థులను బ్యాంకులో నియమించుకోవచ్చని పేర్కొంది, అయితే అందుకుగాను గైనకాలజిస్ట్ నుంచి ఓ ఉత్తరాన్ని సదరు ఉద్యోగులు పోందుపర్చాల్సి వుండేంది.
బ్యాంకు ఉద్యోగాన్ని చేపట్టడం వల్ల సదరు గర్భం దాల్చిన ఉద్యోగి.. పిండం సాధారణ ఎదుగుదలకు ఎలాంటి ఆటంకం కలిగించే అవకాశం లేదని, లేదా ఆమె గర్భస్రావం అయ్యే అవకాశం లేదని లేదా ఆమెపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం లేదని స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ నుండి ఉద్యోగిని ధృవీకరణ పత్రం తీసుకుని బ్యాంకు అధికారులకు సమర్పించాల్సి ఉండేది. అయితే ఈ వివక్షతను 2009లో అప్పటి యూపీఏ ప్రభుత్వం సవరించింది. ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ మేరకు సవరణలు తీసుకువచ్చారు. కేరళలోని మహిళా సంఘాల వినతిమేరకు నిబంధనలను సవరిస్తూ.. ఇకపై గర్బణీ మహిళాల బ్యాంకు ఉద్యోగాల నియామకాల్లో, పదోన్నత విషయంలో వైకల్యంగా పరిగణించరాదని అదేశాలు జారీ చేశారు.
కాగా తాజాగా తభిన్నమైన అదేశాలను ఎస్బీఐ జారీ చేసింది. తన నిబంధనలను ఉపసంహరించుకోవాలని కోరుతూ సీపీఐ రాజ్యసభ సభ్యుడు బినోయ్ విశ్వమ్ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్కు లేఖ రాశారు. ఇక ఇదే విషయంపై ఢిల్లీ మహిళా కమిషన్ స్టేట్ బ్యాంక్కు నోటీసులు సైతం జారీచేసింది. చట్టవిరుద్ధమైన ఈ నిబంధనను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. కొత్తగా ఉద్యోగంలో చేరేవారు, పదోన్నతులపై కొత్త పదవిలో చేరేవారి కోసం ఎస్బీఐ 2021 డిసెంబరు 31న నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది. వీటిపై ఆలిండియా ఎస్బీఐ ఎంప్లాయీస్ అసోసియేషన్ కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more