హరిద్వార్, ఢిల్లీ వేదికగా జరిగిన ధర్మ సంసద్లో విద్వేష పూరిత ప్రసంగాలు చేయడంతో పాటు ఓ వర్గానికి చెందినవారిని ఎదుర్కోవడంలో అవసరమైతే అయుధాలను వాడాలని, వారిపై మారణహోమం సృష్టించాలని వ్యాఖ్యలు చేసిన హిందూ ధర్మ సంసద్ వక్తలను ఎందుకు అరెస్టు చేయలేదని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రింకోర్టు ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి, కేంద్రప్రభుత్వానికి, ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసి.. పది రోజుల వ్యవధిలో నోటీసులకు కౌంటర్ దాఖలు చేయాలని అదేశించిన నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.
ధర్మసంసద్ పేరుతో నిర్వహించిన మతవాద సమావేశంలో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన వారిపై ఇప్పటికే కేసులు నమోదు చేసిన పోలీసులు దేశ అత్యున్నత న్యాయస్థానం నోటీసులతో ఇవాళ అరెస్టు చేశారు. వ్యక్తుల అరెస్టులు ప్రారంభమయ్యాయి. ధర్మ సంసద్లో విద్వేష పూరిత ప్రసంగాలు చేశారంటూ వసీం రిజ్వి అలియాస్ జితేంద్ర త్యాగి త్యాగి, యతి నరసింహానందను ఉత్తరాఖండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముస్లింలపై విద్వేషపూరిత ప్రసంగాలు చేసిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేశాయి. విపక్షాలన్నీ కూడా తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం విదితమే.
ధర్మ సంసద్ వేదికగా ముస్లింలపై జితేంద్ర నారాయణ్ త్యాగి విద్వేష పూరిత ప్రసంగం చేశారంటూ గుల్బర్ ఖాన్ అనే వ్యక్తి హరిద్వార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక.. యతి నరసింహానంద ఆధ్వర్యంలో డిసెంబర్ 17 నుంచి 19 వరకు హరిద్వార్లో ధర్మ సంసద్ జరిగింది. ఈ సందర్భంగానే ఓ వర్గంపై వీరు విద్వేష పూరిత ప్రసంగాలు చేశారు. మరోవైపు ధర్మ సంసద్లో వీరు చేసిన ప్రసంగాలకు గాను ఉత్తరాఖండ్ పోలీసులు జితేంద్ర త్యాగితో సహా పలువురిపై కేసులు కూడా నమోదు చేశారు. హిందూ నేతలు ఇలాంటి ప్రసంగాలు చేయడాన్ని సుప్రీం ధర్మాసనం తప్పుబట్టింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more