Man mistakenly beheaded in cattle festival మద్యం మత్తులో మనిషి తల నరికివేత.. గ్రామదేవతకు నరబలి..

Andhra pradesh man mistakenly beheaded in cattle festival held in chittoor district

Man beheads mans head in intoxicated condition, Man beheaded in village deity fest, man beheaded in kanuma celebrations, man beheades in sankranti celebrations, man beheaded in valasapalle, man beheaded in madanapalle, man beheaded in chittoor, Andhra Pradesh, Crime

A tragic incident took place in the Chittoor district where a man mistakenly beheaded another man under the influence of alcohol while celebrating the cattle festival. Going into the details, a cattle festival as part of the Sankranti celebrations was held on Sunday night at Valasapalle near Madanapalle of Chittoor district.

మద్యం మత్తులో మనిషి తల నరికివేత.. గ్రామదేవతకు నరబలి..

Posted: 01/17/2022 10:20 AM IST
Andhra pradesh man mistakenly beheaded in cattle festival held in chittoor district

పండుగలు, జాతర్ల సమయంలో గ్రామదేవతలకు మేకలు, గోర్రెపొట్టేళను బలి ఇవ్వడం ఆనవాయితి. ఇలాంటి ఆనవాయితినే చిత్తూరు జిల్లాలోని ఓ గ్రామంలో కూడా వుంది. సంక్రాంతి పర్వదినం మూడవ రోజున అంటే కనుమ రోజున అక్కడి గ్రామ దేవతలకు మేకలను బలిఇవ్వడం.. తరువాత వాటిని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన వాటిని ప్రసాదంగా గ్రామస్థులందరూ తినడం కూడా ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో ఈ సారి కనుమ పండగ రోజున కూడా ఈ ఆనాయితిని కొనసాగించే క్రమంలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది.

మేక పోట్టేలును ఒక్క వేటున అమ్మవారికి బలి ఇచ్చేందుకు సన్నధమైన వ్యక్తి మద్యం మత్తులో దారుణానికి ఒడిగట్టాడు. పొట్టేలు అనుకుని దానిని కదలకుండా పట్టుకున్న వ్యక్తి తలను నరికిన ఘటన మండలంలో కలకలం రేపింది. వివరాలు.. మదనపల్లె మండలం వలసపల్లెలో సంక్రాంతి వేడుకల్లో భాగంగా ఆదివారం రాత్రి కనుమ పండుగను నిర్వహించారు. ఇందులో భాగంగా ఊరి పొలిమేరలో గ్రామదేవతకు జంతు బలి ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. తలారి లక్ష్మణ కుమారుడు తలారి సురేష్‌(35) పొట్టేలను పట్టుకుని ఉన్నాడు.

మరో తలారి గంగన్న కుమారుడు చలపతి మద్యం మత్తులో పొట్టేలును నరకబోయి సురేష్‌ తల నరికేశాడు. తీవ్ర రక్తస్రావం అవడంతో బాధితుడిని స్థానికులు మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సమాచారం అందుకున్న రూరల్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సురేష్ తలను చలపతి కావాలని ఏదైనా పగబెట్టుకుని నరికాడా.? లేదా మద్యం మత్తులోనే పొరబాటున నరికాడా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles