ఢిల్లీ వేదికగా గత ఏడాది డిసెంబర్ నెలలో నిర్వహించిన ‘ధర్మ సంసద్’ సమావేశంలో విద్వేష ప్రసంగాలు చేసిన అంశంపై ఇవాళ విచారించిన దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఢిల్లీ పోలీసులతో పాటు ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులను జారీ చేసింది. మతవాద కార్యక్రమాలను నిర్వహించి.. వాటి వేదికగా ఇతర వర్గాలకు చెందిన మైనారిటీ ప్రజలపై విద్వేషపూరిత ప్రసంగాలు చేయడంతో ఈ ఘటనపై పది రోజుల లోపు సమాధానం ఇవ్వాలని అదేశించింది. పాట్నా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అంజనా ప్రకాశ్, జర్నలిస్టు ఖుర్బాన్ అలీ వేసిన పిటిషన్పై కోర్టు విచారణ చేపట్టి ఈ మేరకు నోటీసులు జారీ చేసింది.
డిసెంబర్ 17 నుంచి 19 వరకు హిందూ యువవాహిని, హరిద్వార్ లో మతగురువు యతి నర్సింహానంద్ నిర్వహించిన రెండు వేర్వేరు కార్యక్రమాల్లో ద్వేషపూరిత ప్రస్ంగాలు చేశారని పిటీషన్ దారులు వేర్వురుగా దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటీషన్లు దాఖలు చేశారు. ఈ క్రమంలో జాతీ ప్రక్షాళన చేయడానికి ముస్లింలపై మారణహోమం చేయడానికి బహిరంగంగా పిలుపునివ్వడం అక్షేఫనీయమని పిటీషనర్లు పేర్కోన్నారు. హరిద్వార్లో గత ఏడాది జరిగిన ధర్మ సంసద్ కార్యక్రమంలో.. ముస్లింలకు వ్యతిరేకంగా అసరమైతే ఆయుధాలను కూడా వాడేందుకు వెనకాడరాదని హిందూ నేతలు వివాదాస్పద ప్రసంగాలు చేశారు. దీనికి తోడు ఆ ప్రసంగాల తాలుకు వీడియోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయని,
దీంతో వీళ్లు కూడా మా పక్షం అంటూ మరో వీడియో సామాజిక మాద్యమాల్లో చక్కర్లు కోట్టిందని, అందులో ఓ పోలీసు అధికారి నవ్వుతూ కనిస్తున్నారని పిటీషనర్లు పేర్కోన్నారు. ఢిల్లీలో జరిగిన హిందూ సంసద్ సభావేదికగా.. ఓ వర్గానికి చెందినవారిపై అవసరమైతే ఆయుధాలను కూడా వినియోగించాలని బహిరంగంగా పిలుపునిచ్చినా ఢిల్లీ పోలీసులు ఇప్పటివరకు వారిపై చర్యలు చేపట్టలేదని పిటీషనర్లు సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. ఇక ఇదే తరహాలో ఈ నెల 23న ఉత్తర్ ప్రదేశ్ లోని అలీగడ్ లో జరగనున్న మరో ధర్మ సంసద్ సభను నిలిపివేయాలని స్థానిక అధికారులను సంప్రదించాలని అత్యున్నత న్యాయస్థానం పిటీషనర్లకు సూచించింది.
తరువాత ఓ పోలీసు అధికారి నవ్వుతూ కనిపించడంతోముస్లింలను టార్గెట్ చేయాలన్న అభిప్రాయాల్ని వినిపించారు. ఈ కేసులో దాఖలైన పిటిషన్ను ఇవాళ సర్వోన్నత న్యాయస్థానం త్రిసభ్య బెంచ్ విచారించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ హిమా కోహ్లీతో కూడిన ధర్మాసనం ఈ కేసులో విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. ధర్మ సంసద్ కార్యక్రమాలల్లో విధ్వేషపూరిత ప్రసంగాలను నేతలు యధేశ్చగా చేస్తున్నా.. వారిపై ఎలాంటి చర్యలను పోలీసులు తీసుకోవడం లేదని అన్నారు. ఇప్పటివరకు ఎలాంటి అరెస్టులు జరగలేదు, ఇదే కొనసాగితే దేశంలో అస్తవ్యస్థ వాతావారణం నెలకొంటుందని అందోళన వ్యక్తం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more