వైసీపీ తిరుగుబాటు నేత, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఆంధ్రప్రదేశ్ సీఐడీ పోలీసులు నోటీసులు జారీచేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు హైదరాబాద్ లోని గచ్చిబౌలిలోని ఆయన నివాసానికి పోలీసులు చేరుకున్నారు. గతంలో రఘురామరాజు సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఎంపీపై కేసులు నమోదయ్యాయి, ఈ కేసుల్లో విచారణకు ఈ నెల 17న హాజరుకావాలని అందులో పేర్కొన్నారు. అయితే ఈ నోటీసులపై ఎంపీ రఘురామ ఆగ్రహం వ్యక్తంచేశారు. హిందువులకు సంక్రాంతి చాలా ముఖ్యమైన పండుగ అని, పండుగ రోజుల్లోనే నోటీసులు ఇవ్వడమేంటని ప్రశ్నించారు.
పండుగకు వస్తున్నానని తెలిసి నోటీసులు ఇచ్చారా అని విమర్శించారు. ఏపీ సీఐడీ, సీఎం జగన్కు పండుగ రోజే గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. పండుగ రోజుల్లోనే విచారణ ఎందుకో వాళ్లకే తెలియాలన్నారు. చట్టాలు, రాజ్యాంగం, కోర్టులను నమ్మే వ్యక్తినని, కరోనా ప్రొటోకాల్స్కు అనుగుణంగా విచారణకు హాజరవుతానని వెల్లడించారు. గతంలో తనను హింసించినప్పుడు కెమెరాలు ఎందుకు లేవన్నారు. ఎస్సీలపైనా ఎస్సీ కేసులు పెట్టడం చూస్తున్నామన్నారు. తనను హింసించిన వీడియోలు చూసి ఎవరు ఆనందపడ్డారో తనకు తెలుసన్నారు. తనను ఎంతగా హింసించారో ప్రజలకు తెలియాలన్నారు.
రావణరాజ్యంపై ప్రజలు విసుగెత్తిపోయారని ఆగ్రహం వ్యక్తంచేశారు. హీరో ఎవరో, కీచకుడెవరో తేలుద్దామన్నారు. సునీల్ కుమార్ నేతృత్వంలోని ఒక బృందం వచ్చిందని చెప్పారు. మరిన్ని వివరాలు రాబట్టేందుకు నోటీసులు ఇచ్చామని చెప్పారన్నారు. ఈ నెల 17న విచారణకు రావాలని తెలిపారన్నారు. గురువారం నరసాపురం వస్తున్నానని జిల్లా కలెక్టర్, ఎస్పీకి చెప్పానని వెల్లడించారు. ఏపీ సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను ఎంపీ రఘురామకు పోలీసులు నోటీసులు జారీచేశారు. బుధవారం ఉదయం హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఆయన నివాసానికి చేరుకున్న పోలీసులు ఆయనకు నోటీసులు అందించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more