దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ తో కూడిన మూడవ దశ ముపు ప్రమాద గంటికలు మ్రోగిస్తోంది. వారం రోజుల వ్యవధిలో కేసులు ఏకంగా లక్షన్నర మార్కుకు చేరువలో నమోదు అయ్యాయి. జనవరి 1వ తేదీన 27,553 కేసులు నమోదు కాగా, అందులో కేవలం 309 ఒమిక్రాన్ కేసులు ఉన్నాయని కేంద్ర అరోగ్య మంత్రిత్వశాఖ గణంకాలు వెల్లడించాయి. ఇక వారం రోజుల వ్యవధిలో కొత్త కరోనా కేసులు ఏకంగా లక్షన్నర మార్కుకు చేరకున్నాయి. ఇక ఇందులో దాదాపుగా మూడు వేలకు పైగా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులేనని వైద్య నిఫుణులు అంచనా వేస్తున్నారు.
కరోనా బాధితులందరి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపించడం కుదరకపోవడంతో.. సేకరించిన నమూనాల ఆదారాంగా ఏకంగా కొత్త కేసులలో 70శాతం మేర కేసులు నమోదవుతున్నాయని వైద్యవర్గాలు అంచనావేస్తున్నాయి. క్రితం రోజున 15 లక్షల మందికి కరోనా పరీక్షలు చేయగా, ఏకంగా లక్షా నలబై రెండు వేల మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. రోజువారీ పాజిటివిటీ రేటు ఏకంగా 9.28కి చేరుకుంది. ఇది వైద్యనిపుణులను అందోళనకు గురిచేస్తోంది. వారం రోజుల వ్యవధిలో కరోనా ఉధ్దృతంగా వ్యాప్తి చెందడం పట్ల కలవరం చెందుతున్న నిపుణులు దేశ ప్రజలు కరోనా నియంత్రణ చర్యలను తప్పనిసరిగా పాటించాలని సూచిస్తున్నారు.
మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడులో వైరస్ వ్యాప్తి చాలా తీవ్రంగా ఉంది. ఒక్క మహారాష్ట్రలో 40 వేల కేసులు నమోదు కాగా.. అందులో ముంబైలో వెలుగు చూసిన కేసుల సంఖ్యే 20,971గా నమోదైంది. పశ్చిమ బెంగాల్ లో 18 వేలు, ఢిల్లీలో 17 వేల కేసులు బయటపడ్డాయి. మిజోరంలో పాజిటివిటీ రేటు 15 శాతానికి చేరింది. ఒమిక్రాన్ బారిన పడిన మొత్తం 3071 రోగులలో 1203 మంది రోగులు చికిత్స పోందిన తరువాత కొలుకుని డిశ్చార్జ్ అయ్యారని వైద్యవర్గాలు వెల్లడించాయి. కొత్త వేరియంట్ బారిన పడిన వారిలో మహారాష్ట్రలో అత్యధికంగా 876 మంది ఉండగా, ఢిల్లీలో 513 మంది వున్నారని కేంద్రం విడుదల చేసిన గణంకాలు స్పష్టంచేస్తున్నాయి.
ఇక ఇటు తెలంగాణలోనూ కరోనా కేసులు వేగాన్ని అందుకుంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా నమోదైన కరోనా కేసుల సంఖ్య రెండు వేల మార్కును చేరుకోగా, కేవలం జీహెచ్ఎంసీ పరిధిలోనే 1500 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో గత 24 గంటల వ్యవధిలో మొత్తంగా 2,295 కొత్త కేసులు నమోదుకాగా, ముగ్గురు వ్యక్తులు కరోనా బారిన పడి మరణించారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో మృతుల సంఖ్య 4,039కి చేరింది. కరోనా నుంచి చికిత్స పోందుతూ నిన్న 278 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 9,861 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కరోజు వ్యవధిలో నమోదైన మొత్తం కేసుల్లో 1,452 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదవడం గమనార్హం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more