కరోనా వైరస్ మళ్లీ దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న తరుణంలో ప్రజలు భయాందోళన చెందకుండా ఊరటనిచ్చేలా అమెరికా ఎఫ్.ఢి.ఏ అగ్రరాజ్యంలోని కరోనా బాధితులకు చికిత్సకు అనుమతించిన ఓరల్ డ్రగ్ మోల్నుపిరవీర్ ను ఇటీవల భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) అధికారులు కూడా అనుమతించిన విషయం తెలిసిందే. ఇక ఈ ఓరల్ డ్రగ్ వైరస్ ఆర్ఎన్ఐలోకి దూసుకెళ్లి.. అవి వృద్ది చెందకుండా అడ్డుకోవడంలో దోహదపడతాయని పరిశోధకులు చెప్పిన విషయం తెలిసిందే. ఈ మందును భారత దేశంలోని 18 ఫార్మా సంస్థలు తయారు చేసేందుకు కూడా ఇప్పటికే అనుమతి పోందడంతో వాటిలో దాదాపు అన్ని కంపెనీలు ఈ మాత్రను భారతీయ విఫణిలోకి కూడా ప్రవేశపెట్టాయి.
అయితే మోల్నుఫిరవిర్ మందు వినియోగంతో పలు సైడ్ ఎపెక్ట్స్ ఉన్నాయని ఐసీఎంఆర్ రెండు రోజుల క్రితం హెచ్చరికలు జారీ చేసింది. మెల్నుఫిరవిర్ డ్రగ్ తో ముప్పు పోంచి వుందని భారత వైద్య పరిశోధన మండలి చీఫ్ బలరాం భార్గవ అప్రమత్తం చేశారు. ఈ మాత్రలతో జన్యువుల్లో శాశ్వతంగా మార్పులు వస్తాయని పేర్కొన్నారు. అంటే ఎముకలు, కండరాలు దెబ్బతినే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. అందువల్లే ఈ ట్యాబ్లెట్లను కొవిడ్ జాతీయ టాస్క్ఫోర్స్ చికిత్సా మార్గదర్శకాల్లో చేర్చలేదని కూడా చెప్పారు. ఇక ఈ మాత్రలు వాడిన మహిళలు ఆ తర్వాత మూడు నెలలపాటు గర్భం దాల్చకుండా జాగ్రత్త పడాలని సూచించారు.
అయితే ఐసీఎంఆర్ లేవనెత్తిన దుష్ప్రభావాలపై మెర్క్ ఇండియా ఫార్మా సంస్థ స్పందించింది. అత్యవసర వినియోగానికి మోల్నుపిరవిర్కు భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) అనుమతులు మంజూరు చేసిన తర్వాతి రోజే ఐసీఎంఆర్ చీఫ్ బలరామ్ భార్గవ సైడ్ ఎఫెక్ట్స్ చాలా తీవ్రంగా వుంటాయని.. అయితే కొందరిలో మాత్రం ఇది తీవ్ర ప్రభావం కూడా చూపుతుందని అన్నారు. ఈ నేపథ్యంలో స్పందించిన మెర్క్ ఇండియా ఫార్మా.. మోల్నుపిరవిర్ ట్యాబ్లెట్ల సామర్థ్యంపై తమకు పూర్తి నమ్మకం ఉందని స్పష్టం చేసింది. ఈ మాత్రల వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు లేవని ఫేజ్ 3 ట్రయల్స్లో వెల్లడైనట్టు పేర్కొంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more