సినీ పరిశ్రమలను ఓ వైపు పోర్నోగ్రఫీ, మరోవైపు హనీ ట్రాప్ వ్యవహారాలు కుదిపేస్తున్నాయి. బాలీవుడ్ ప్రముఖ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్ర ఫోర్నోగ్రఫీ అభియోగాలపై జైలు పాలైన విషయం కూడా తెలిసిందే. అయితే బెయిలుపై విడుదల అయిన ఆయన మాత్రం.. తాను ఎప్పుడూ తన కుటుంబం తలదించుకునే పనులు చేయలేదు.. చేయబోను అని స్పష్టం కూడా చేశారు. అయితే ఈ కేసులో రాజ్ కుంద్రాకు సహకరించారన్న అభియోగాలపై నటి గెహనా వశిష్ట్ కూడా సహకరించారని ఇప్పటికే దుమారం రేపుతుంది. ఈ వ్యవహారంలో రాజ్ కుంద్రా సహా గెహనా వశిష్ట్ ఇద్దరూ అరెస్ట్ అయ్యి బెయిలుపై బయటకు వచ్చిన విషయం తెలిసందే.
అంతటి పెద్దవారికే అరెస్టులు తప్పనప్పుడు.. ఇలాంటి చౌకబారు పనులకు పాల్పడుతున్నవారు వాటికి దూరంగా వుండాల్సిందిపోయి.. వాళ్లు పెద్దవాళ్లు కాబట్టే దోరికారు. తాము సందుల్లో గోందుల్లో ఇలాంటి చర్యలకు పాల్పడతామనుకున్నా.. చట్టం చేతులు చాలా పెద్దవని తెలియకపోవడం అవివేకం అవుతుంది. తాము చేసే ఈ అసాంఘిక కార్యకలాపాలకు బోర్డులు పెట్టి మరీ కస్టమర్లను అకర్షించడం.. బోర్డులతో పోలీసులను బోల్తా కోట్టించాలని భావించడం కూడా అవివేకమే. తాడి తన్నేవాడు వుంటే తలదన్నె వాడు కూడా ఉన్నాడు అన్నట్లు.. ఎన్ని రకాలుగా వేషాలు మార్చి అక్రమార్కులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా.. వారిని ఇట్టే పట్టేసి గుట్టు రట్టు చేయడం పోలీసులకు పరిపాటే.
ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలను మారుపేరుతో నిర్వహిస్తున్న ఓ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. కుషాయిగూడ పరిధిలోని ఓ మసాజ్ సెంటర్పై పోలీసులు, రెవెన్యూ అధికారులు ఆకస్మిక దాడులు చేసి సెంటర్ను సీజ్ చేశారు. ఏఎస్రావునగర్లో గ్లోవిష్ బ్యూటీ కేర్ పేరుతో కొంత కాలంగా మసాజ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. మసాజ్ సెంటర్ పేరుతో ఈ కేంద్రంలో అసాంఘిక కార్యకలాపాలు కూడా నిర్వహిస్తున్నారు. చీకటి బాగోతాలకు తెరలేపుతూ ఐదుగురు మహిళలతో వ్యభిచారం నిర్వహిస్తున్నారని సమాచారం. విశ్వసనీయవర్గాల నుంచి సమాచారం అందడంతో పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా మాదిపల్లి మహేశ్ అనే వ్యక్తితో పాటు, మరో ఐదుగురు మహిళలను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ మన్మోహన్ తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more