కరోనా మహమ్మారి ఒమిక్రాన్ వేరియంట్ శరవేగంగా విస్తరిస్తుందని, డెల్టా వేరియంట్ తో పోల్చితే ఇది ఏకంగా ఆరు రెట్లు అధికంగా వ్యాప్తి చెందుతుందని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు దేశ వైద్య నిపుణులు కూడా అంచనా వేశారు. ఇన్నాళ్లు ఇది పెద్దగా ప్రభావం చూపడం లేదని అనుకున్నా ప్రపంచ వ్యాప్తంగా మరణాలు కూడా నమోదవుతున్న క్రమంలో ఇది కూడా అందోళనకర వేరియంటేనని వైద్యనిపుణులు అంచానా వేస్తున్నారు. బ్రిటన్ లో మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండగా, అటు అగ్రరాజ్యం అమెరికా సహా ఇటు ఇజ్రాయిల్ లోనూ మరణాలు నమోదు చేసుకున్నాయి.
ఇటు ఒమిక్రాన్ కేసులు మన దేశంలోనే రోజురోజుకూ పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటికే 250 చేరువలో వున్న ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇటు తెలంగాణలోనూ ఒమిక్రాన్ కేసులు గణనీయంగా పెరుగుతుండటం అందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు ఒమిక్రాన్ నేపథ్యంలో పలు చర్యలు తీసుకోవాలని.. ఈ మేరకు అదేశాలను జారీ చేసింది. ఈ మేరకు దాఖలైన పిటీషన్లపై విచారించిన న్యాయస్థానం ప్రభుత్వానికి అదేశాలు జారీ చేసింది. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి వేడుకలపై ఆంక్షలు విధించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు సమూహంగా జరుపుకునే వేడుకలపై ఆంక్షలను అమలు చేయాలని అదేశాలను జారీ చేసింది. మరీ ముఖ్యంగా ప్రారంభదశలోనూ నియంత్రణ చర్యలు చేపట్టడం చాలా అవసరం అని పేర్కోన్న న్యాయస్థానం ఈ క్రమంలో క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలతో పాటు సంక్రాంతి పండగ పర్వదినాలలో జనం గుంపులు గుంపులుగా ఉండకుండా రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు ఇవ్వాలని ఆదేశించింది. ఈ సందర్భంగా మహారాష్ట్ర, ఢిల్లీ ప్రభుత్వాల మాదిరే ఆంక్షలు విధించాలని ఆదేశించింది. ఎయిర్ పోర్ట్ లో ఉన్న విధంగానే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే జనాలకు తగిన పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాటు చేయమని ఆదేశించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more