ఫ్రిగా వస్తే ఫెనాయిల్ తాగేవాళ్లును చూశాం కానీ.. ఏకంగా కనబడిందల్లా కాజేసేవాళ్లను మాత్రం చాలా అరుదుగా చూస్తుంటాం. ఏది తస్కరించాలో.. ఏదీ వద్దో కూడా తెలియని ఘనులు ఏకంగా రైల్వే స్టేషన్లోని పురాతన ఇంజన్ ను దొంగలించారు. ఔరా.. రైలు ఇంజన్ ను దొంగలించడం ఏలా సాధ్యం. అది అయ్యే పనేనా.? అంటే.. ఈ అనితర సామాన్యులతో అన్నీ సాధ్యమనే చెప్పాలి. అయినా రైలు ఇంజన్ ఎత్తుకెళ్లినా మళ్లీ పట్టాలపైకి తీసుకురావాల్సిందే కదా.? అది పట్టాలపై కాకుండా మరెక్కడ నడుపుతారు.? అనేగా మీ సందేహం. అక్కడికే వస్తున్నాం.
ఈ ఘరాణా దొంగలు ఏకంగా రైలు ఇంజన్ ను మాయం చేశారు. ఓహ్ ఇది దొంగల పనా.? అంటారా. అంతేగా మరి ఇంటిదొంగలను ఈశ్వరుడైనా పట్టలేడు అంటారుగా. కంచే చేను మేస్తే.. ఎవరికి మాత్రం తెలుస్తుంది. మీకు వచ్చిన డౌట్ కరెక్టే. వీళ్లు ఇంటి దొంగలే. వీరు పనిచేసిది కూడా రైల్వేశాఖలోనే కావడంతో.. రైలు ఇంజన్ ను కొట్టేయడం వీరికి సునాయాసమైంది. నకిలీ పత్రాలను సృష్టించిన ముగ్గురు కేటాగాళ్లు కలసి ఈ ఘనకార్యానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. బిహార్ పుర్ణియా కోర్టు రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్న సమస్తిపుర్ లోకో డీజిల్ షెడ్లో రాజీవ్ రంజన్ ఝా అనే వ్యక్తి ఇంజినీర్గా పనిచేస్తున్నాడు.
తాను పనిచేసే స్టేషన్లో చిన్నరైల్వే ట్రాక్పై తిరిగే ఓ పాత రైలు ఇంజిన్ ఉంది. దానిపై కన్నేసిన రాజీవ్.. రైల్వే శాఖ ఉన్నాతాధికారుల నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాకున్నా.. వచ్చినట్లు నకిలీ ధ్రువపత్రాలను సృష్టించేశాడు. నకిలీ ధ్రువపత్రాలను సృష్టించిన రాజీవ్ డిసెంబర్ 14న గ్యాస్ కట్టర్తో రైలు ఇంజిన్ను ముక్కలుగా చేసేశాడు. ఇందుకు ఓ హెల్పర్ కూడా అతనికి సాయం చేశాడు. కొంతమంది అధికారులు దాన్ని అడ్డుకునే సరికి నకిలీ ధ్రువపత్రాలను చూపించాడు. ఇంజిన్ పాతదైపోయిందని, విడిభాగాలుగా చేసి డీజిల్ షెడ్కు తరలించాల్సిందిగా ఉన్నతాధికారులు అదేశించారని వారిని నమ్మించాడు.
ఆ పత్రాల ఆధారంతో ఏకంగా రైలు ఇంజిన్ను పాత సామాను కొనుగోలు చేసే వారికి అమ్మేశాడు రాజీవ్ రంజన్ ఝా. ఈ దొంగతనం కుట్రలో అతనికి స్థానిక పోలీస్ ఇన్స్పెక్టర్, ఓ హెల్పర్ కూడా సహకరించారు. అయితే రాజీవ్ పై స్టేషన్ అధికారులకు అనుమానం రావడంతో డీజిల్ షెడ్ కు వెళ్లి చూశారు. అక్కడి రైలు ఇంజన్ పరికరాలు లేకపోవడంతో.. వారు ఉన్నాతాధికారులకు సమాచారం అందించారు. అయితే తాము రైలు ఇంజన్ ను స్రాప్ చేయాలని ఎవరికీ ఎలాంటి అదేశాలను పంపలేదని రైల్వే ఉన్నతాధికారులు వివరణ ఇచ్చారు. దీంతో స్టేషన్ మాస్టార్, ఉద్యోగులు కలసి ఆర్పీఎఫ్ పోలీసులకు పిర్యాదు చేశారు. పోలీసు విచారణలో అసలు విషయాన్ని అంగీకరించాడు రాజీవ్ రంజన్ ఝా.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more