ఐదు రోజుల క్రితం మేజర్లుగా వున్న స్త్రీ, పురుషుడు ఒక్కటిగా జీవించడాన్ని సహజీవనంగా పేర్కోనలేమని వ్యాఖ్యానించిన పంజాబ్ హర్యానా హైకోర్టు తాజాగా సహజీవనంపై కీలక వ్యాఖ్యలు చేసింది. మేజర్లు అయినా చట్టబద్ధంగా వివాహం చేసుకునే వయసుకు చేరుకోక ముందు.. 18 ఏళ్లు నిండిన మహిళతో పరస్పర అంగీకారం మేరకు వైవాహిక తరహా జీవనం కొనసాగించుకోవచ్చని తీర్పును వెలువరించింది. 2018 మే నెలలో దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ కేసు విచారణలో భాగంగా జారీ చేసిన తీర్పు మాదిరే పంజాబ్ అండ్ హైకోర్టు వ్యాఖ్యలు ఉన్నాయి.
వయోజనులైన స్త్రీ, పురుషుడు వివాహం లేకుండానే సహజీవనం చేసుకోవచ్చంటూ నాడు సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఓ జంట రక్షణ కోరుతూ ఆశ్రయించడంతో హైకోర్టు వారికి మద్దతుగా నిలిచింది. పంజాబ్ లోని గురుదాస్ పూర్ జిల్లాకు చెందిన ఓ జంట సహజీవనం సాగిస్తున్నారు. వీరిద్దరికీ వయసు 18 ఏళ్లు నిండింది. హిందూ వివాహ చట్టం ప్రకారం ఆమెకు వివాహ వయసు వచ్చింది కానీ, అతడికి 21 ఏళ్లు నిండితేనే ఆ అర్హత లభిస్తుంది. దీంతో వీరిద్దరు సన్నిహిత సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. వారు ఒక్కటిగా జీవించడాన్ని వ్యతిరేకిస్తున్న ఇరు కుటుంబాలు వారిని తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాయి.
ఈ నేపథ్యంలో తమకు రక్షణ కల్పించాలంటూ వారు హైకోర్టును వేడుకున్నారు. తమను చంపే ప్రమాదం ఉందని కోర్టుకు నివేదించారు. దీనిపై హైకోర్టు ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘రాజ్యాంగం ప్రకారం పౌరుల ప్రాణాలు, స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. పిటిషనర్ (పురుషుడు) వివాహ వయసుకు చేరుకోలేదన్నది వాస్తవం. అలాగని చెప్పి భారతీయ పౌరుడిగా రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను పొందకుండా చేయడం సరికాదు’’ అని పేర్కొంది. పిటిషనర్ల దరఖాస్తును పరిశీలించి, వారి ప్రాణాలకు ముప్పు ఉంటే తగిన రక్షణ కల్పించాలంటూ గురుదాస్ పూర్ ఎస్ఎస్ పీని జస్టిస్ హర్నరేష్ సింగ్ ఆదేశించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more