మరోగంటలో పెళ్లి.. అందరూ వరుడి కోసం వేచిచూస్తున్నారు.. పెళ్లి కొడుకును తీసుకురావడానికి వారింటికి వెళ్లిన బంధువులకు షాక్ తగిలింది. ఏం చేయాలో అర్థంకాని స్థితిలో వారు ఇరుగు పోరుగువారిని ఆరా తీశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. వారింటి ముందు నాటిన పందిరి గుంజ అలానే ఉంది. ఇంటికి వేసిన రంగులు తడి కూడా ఆరలేదు. ఇంటికి కట్టిన మామిడి తోరణాలు.. వేసిన పందిరి అంతా అలానే వుంది. కానీ ఇంతలో ఏం జరిగింది. ఈ లోగా పెళ్లి వేదిక నుంచి పెద్దల ఫోన్ కాల్స్. ఇక లాభం లేదని విషయాన్ని వారికి తెలియజేశారు. అదెలా సాధ్యం అనుకుంటూ పెళ్లి వేదిక వద్ద బంధువులు కూడా హైరానా చెందారు.
వరుడి గ్రామం నుంచి వివాహవేదికకు కనీసం పది నిమిషాల సమయం కూడా పట్టదు. కానీ అరగంటకు పైగానే ఎదురుచూసినా వరుడి జాడ లేదు. సంగారెడ్డి జిల్లాలోనే ఇలాంటి ఘటన ఇప్పటి వరకు జరగలేదు. అలాంటిది అంతపెద్ద అన్యాయం మా బిడ్డకే ఎందుకు జరిగింది.. అంటూ వధువు తల్లితండ్రులకు తోడు అమె బంధువులు కూడా కన్నీళ్ల పర్యంతమయ్యారు. అసలేం జరిగిందంటే.. సరిగ్గా పెళ్లి రోజున.. కళ్యాణానికి ఓ గంట ముందు.. వరుడు తన ఇంట్లోంచి కట్నం డబ్బుతో పాటు బంగారు ఆభరణాలను తీసుకుని పరారయ్యాడు. ఈ విషయం తెలియడంతో వరుడి తల్లిదండ్రులు కూడా తమను వధువు కుటుంబం వదలదన్న భయంతో పలాయనం చిత్తగించారు.
ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా వున్నాయి. సంగారెడ్డి జిల్లా కంది మండలం చిమ్నాపూర్ గ్రామంలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. చిమ్నాపూర్ గ్రామానికి చెందిన యువతిని.. కొండాపూర్ మండలం మల్కాపూర్కు చెందిన మాణిక్ రెడ్డికి ఇచ్చి వివాహం జరిపించాలని ఇరు తరపు పెద్దలు నిర్ణయించారు. ఈ మేరకు ఆగస్టులో ఈ నూతన జంటకు నిశ్చితార్థం కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా వరుడికి రూ. 25 లక్షల నగదు, 25 తులాల బంగారాన్ని కట్నంగా ఇచ్చారు.
ఈ నెల 12న వీరి వివాహం జరగాల్సి ఉండగా, సంగారెడ్డిలోని పోతిరెడ్డిపల్లిలో కల్యాణ మండపం ఏర్పాటు చేశారు. సరిగ్గా మరో గంటలో వివాహం జరుగుతుందనగా కట్నంగా ఇచ్చిన రూ. 25 లక్షల నగదు, 25 తులాల బంగారం పట్టుకుని వరుడు ఊరి నుంచి పరారయ్యాడు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు కూడా ఊరు విడిచారు. దీంతో పెళ్లి ఆగిపోయింది. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, బాధిత వధువు నిన్న జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలోనూ వరుడు, అతడి కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more