ప్రపంచ వ్యాప్తంగా 46 దేశాలకు విస్తరించిన ఒమిక్రాన్ వేరియంట్ ఇటు మన దేశంలోనూ 23 మందికి సోకిందన్న వార్తలు వెలువడ్డ విషయం తెలిసిందే. కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలోనూ ఒమిక్రాన్ వేరియంట్ కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది. జిల్లాలోని సంతబోమ్మాలి మండలానికి చెందిన వ్యక్తి కరోనా బారిన పడటంతో ఆయనకు ఒమిక్రాన్ వేరియంట్ సోకిందని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. అయితే వైద్యశాఖ అధికారులు మాత్రం ముందస్తు చర్యలు తీసుకోవడంతో పాటు బాధితుడి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపారు. నివేదికలు వచ్చిన తరువాత కానీ తాము ఒమిక్రాన్ వేరియంట్ అని నిర్థారించలేమని అంటున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. సంతబోమ్మాలి మండలం పరిధిలోని ఉమిలాడ గ్రామవాసి ఇటీవల దక్షిణాఫ్రికా దేశం నుంచి శ్రీకాకుళం జిల్లాలోని తన స్వగ్రామానికి చేరకున్నాడు. అయితే ఆయన చేరుకున్న రోజున బాగానే వున్నా.. నిన్న ఆయన కొంత అస్వస్థతకు గురయ్యాడు. దీంతో ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోగా ఆయనకు కరోనా వైరస్ సోకిందని నిర్థారణ అయ్యింది. అయితే ఆయన సౌతాఫ్రికా నుంచి రావడంతో గ్రామంలోని వారంతా ఆయనకు ఒమిక్రాన్ వైరస్ సోకిందని భయాందోళన చెందుతున్నారు.
కాగా వైద్యాధికారులు మాత్రం ఇప్పుడే బాధితుడికి ఒమిక్రాన్ వేరియంట్ కరోనా మహమ్మారి సోకిందని నిర్థారించలేమని అన్నారు. బాధితుడి నుంచి నమూనాలను సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం హైదరాబాద్ కు పంపామని.. నివేదికలు వచ్చిన తరువాత కానీ ఏ వేరియంట్ సోకిందన్న విషయమై స్పష్టత వస్తుందని అన్నారు. కాగా బాదితుడు సౌతాఫ్రికా నుంచి లండన్ కు వెళ్లి.. అక్కడి నుంచి ముంబైకి చేరుకున్నాడు. దీంతో ముంబైలోని వైద్య అధికారులు కరోనా పరీక్షలు చేయగా, అతనికి కరోనా లేదని నిర్థారణ అయ్యిందని తెలిపాడు. అక్కడి నుంచి వైజాగ్ కు చేరుకుని.. సోంత గ్రామానికి చేరుకున్న తరుణంలో బాధితుడు కరోనా బారిన పడ్డాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more