వ్యవసాయ చట్టాల ఉపసంహరణ కోసం ఏకంగా ఏడాది కాలంగా నిరసనలు తెలిపిన రైతులు.. తమ చెంతకు ప్రభుత్వం దిగివచ్చేలా చేశారు. అంతా అనుకున్నట్లుగానే జరిగినా.. రైతులు మాత్రం తమ నిరసనలను కొనసాగిస్తూనే వున్నారు. రైతుల ఉనికికే ప్రమాదాన్ని తెచ్చిపెట్టే మూడు వ్యవసాయ సాగు చట్టాల ఉపసంహరణ తరువాత.. తాజాగా అత్యంత కీలకమైన చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. రైతు ఉత్్పత్తులైన పంటంకు ఇచ్చే అత్యధిక విక్రయ దరపై చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తూ రైతులు ఢిల్లీ సరిహద్దులోనే తమ నిరసన దీక్షలను కొనసాగిస్తున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నాయకురాలు ఉమా భారతి స్పందించారు. ప్రధాని నిర్ణయం తనను చాలా బాధించిందని అన్నారు. వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్నట్టు ప్రధాని మోదీ చేసిన ప్రకటన తనను కలచివేసిందని ఆమె పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర్య నాటి నుంచి ఇప్పటివరకు దేశంలో జరిగిన రైతు ఉద్యమాల నేపథ్యంలో ప్రభుత్వాలు దిగివచ్చినా.. రైతులకే తమ తొలి ప్రాధాన్యం ఇస్తామని చెప్పినా.. రైతులు వారిని విశ్వసించలేదని అన్నారు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వ నిర్ణయాలతో కానీ, కృషితో కానీ రైతులు సంతృప్తి చెందలేదన్నారు.
నూతన వ్యవసాయ సాగు చట్టాలను రైతులకు అర్థమయ్యేలా వివరించడంలో బీజేపి పార్టీ నేతలు, పూర్తిగా విఫలమయ్యారని అమె విమర్శించారు. సాగు చట్టాలను సమగ్రంగా వివరించడంలో బీజేపీ పూర్తిగా విఫలమయ్యారని చెప్పారు. రైతులకు సరైన పద్ధతిలో ఎందుకు వివరించలేక పోయారని ప్రశ్నించారు. ఈ నూతన సాగు చట్టాల విషయంలో విపక్షాలను ఎదుర్కొలేకపోయామని పేర్కొన్నారు. వ్యవసాయ చట్టాల ఉపసంహరణ తనకు నచ్చలేదని, అందుకే మూడు రోజుల తర్వాత స్పందిస్తున్నానని తెలిపారు. మోదీ ఆ ప్రకటన చేసిన సమయంలో వారణాసిలో గంగా నది ఒడ్డున ఉన్నట్టు పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more