కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులను ఉద్దేశించి ఇటీవల దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పలు వ్యాఖ్యలు చేసింది. ఉద్యమాలు చేయడంలో తప్పలేదు.. రైతులు తమ నిరసనలను వ్యక్తం చేయడంలోనూ తప్పులేదు.. అయితే తద్వారా రోడ్డను బ్లాక్ చేయడం మాత్రం సమంజసం కాదని పేర్కొనింది. దీంతో ఈ విషయమై స్పందించిన సంయుక్త కిసాన్ మోర్చా అధ్యక్షుడు రాకేశ్ తికాయత్ స్పందించారు. రైతు నిరసనల్లో రోడ్డలను అటకాయించాలని ప్రయత్నించడం మా ఉద్యేశ్యమే కాదని అని అన్నారు. ఇది తన నిరసనల్లో భాగం కూడా కాదని అన్నారు.
దేశంలో ఎక్కడ తమ పంటకు గిట్టుబాటు ధర లభిస్తుందంటే అక్కడ తమ పంటను అమ్ముకోవచ్చునని ప్రధానమంత్రి నరేంద్రమోడీ చెప్పారని, అయితే ఎక్కడికి వెళ్లాలన్న రోడ్లు తెరచివుండాలన్నదే తమ అభిమతమని.. తామెందుకు రోడ్లను బ్లాక్ చేస్తామని రాకేశ్ తికాయత్ ప్రశ్నించారు. ఢిల్లీ శివార్ల నుంచి పార్లమెంటుకు వెళ్లాలన్నా.. అక్కడ తమ పంటను అమ్ముకాలు జరుపుకోవాలన్నా రోడ్లు తెరచే వుండాలన్నారు. రోడ్లు తెరచే వుండాలి.. తమ ట్రాకర్లే ముందుగా వెళ్లాలని ఆయన అకాంక్షించారు. ప్రభుత్వ ప్రకటనల్లోని ద్వంద అర్థాలను ఈ రోడ్ల మూసివేత తెలియజేస్తుందని.. ఆయన కేంద్ర ప్రభుత్వానికి చురకలు అంటించారు.
ఇదిలావుండగా, దేశ రాజధాని సరిహద్దులోని సింఘు, టిక్రీ, ఘాజీపూర్ ప్రాంతాల్లో సుమారు 11 నెలలుగా రైతులు తమ నిరసనలు తెలుపుతూనే వున్నారు. అయితే ఉత్తర్ ప్రదేశ్ వైపు నుంచి ఢిల్లీ చేరుకునే ఘాజీపూర్ ప్రాంతంలో రైతులు ఢిల్లీలోకి రకుండా అడ్డుకునేందుకు జాతీయ రహదారిని పూర్తిగా పోలీసులు బారీకేడ్లతో మూసివేశారు. దాదాపు ఐదు దశల్లో ఈ రోడ్లను మూసివేశారు. తాజాగా సుప్రీంకోర్టు అదేశాల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు ఘాజీపూర్ ప్రాంతంలో రోడ్లపై ఏర్పాటు చేసిన బారీకేడ్లను తొలగిస్తున్నారు. ఉక్కు రాడ్లు, సిమెంటుతో పాటు కంచెలతో వేసిన బ్యారికేడ్లను పూర్తిగా తొలగిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more