రాజకీయ నాయకులు ఎప్పుడు సహనాన్ని, సంయమనాన్ని పాటించకపోయినా.. సరిగ్గా ఎన్నికల ఏడాది అందునా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మాత్రం తప్పకుండా వాటిని బలవంతంగానైనా తెచ్చుకున్నట్లు నటిస్తారు. ఎందుకంటే వారిని తమ నియోజకవర్గంలోని ప్రజలు ఏమి కావాలన్న సమకూరుస్తామని చెబుతారు. ఎవరు ఎలా నిలదీసినా.. దానికి బదులిస్తారు. కానీ పంజాబ్ లోని ఓ రాజకీయ నాయకుడు మాత్రం అందుకు పూర్తి భిన్నం. ఎందుకంటారా.? తనను అభివృద్దిపై ప్రశ్నించిన ఓయువకుడి చెంప చెల్లుమనిపించాడు. ఏరా నీకు నేను సమాధానం చెప్పాలా.? అంటూ విరుచుకుపడ్డాడు.
ఈ షాకింగ్ ఘటన పంజాబ్లోని పఠాన్కోటలో జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కావడంతో రాజకీయ దుమారం రేగింది. దీంతో అక్కడి అధికార పార్టీకి ఈ ఘటన తలనొప్పిగా మారింది. ఆ వీడియోలో.. పఠాన్కోట్ జిల్లాలోని బోయా నియోజకవర్గ ఎమ్మెల్యే జోగిందర్ పాల్ స్థానికంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎమ్మెల్యే ప్రసంగం కొనసాగుతుండగా ఓ యువకుడి వచ్చి నియెజకవర్గంలో ఏం అభివృద్ధి చేశారో తెలపాలని ప్రశ్నిస్తాడు. దీంతో అతని ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది పోయి కోపంతో ఊగిపోయిన ఎమ్మెల్యే ఆ యువకుడిని చెంప చెల్లుమనిపించారు.
అంతేకాకుండా అక్కడ ఉన్న పోలీసులు, ఇతర నేతలు కూడా ఆ వ్యక్తిని చితకబాదారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది. రాష్ట్ర హోం మంత్రి సుఖ్జీందర్ సింగ్ రాంధవా ఈ అంశంపై మాట్లాడుతూ: "ఎమ్మెల్యే ఈ విధంగా ప్రవర్తించకూడదు. మేము ప్రజా ప్రతినిధులు, వారికి సేవ చేయడానికి ఇక్కడ ఉన్నామని తెలిపారు. దెబ్బలు తిన్న ఆ యువకుడి తల్లి తన కుమారుడు ప్రజా నాయకుడిని ఒక సాధారణ ప్రశ్న అడిగినందుకు ఇంత దారుణంగా కొట్టడమేంటని ఆవేదన వ్యక్తం చేసింది. మొత్తానికి అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే.. పార్టీకే నష్టం కలిగించే చర్యలు చేయడంతో పార్టీ అధిష్టానం కూడా దృష్టిసారించింది.
Joginder Pal, the @INCPunjab MLA from Bhoa assembly seat in Pathankot district, when asked by a young man about his performance in the last 4.5 years....this is how the MLA responded....@ndtv pic.twitter.com/p2AVSOtqjx
— Mohammad Ghazali (@ghazalimohammad) October 20, 2021
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more