నకిలీ మార్కుల షీట్ (మెమో) సమర్పించిన కేసులో బీజేపి ఎమ్మెల్యేకు ఐదేళ్ల కారాగార శిక్షను విధిస్తూ న్యాయస్థానం తీర్పును వెలువరించింది. ఈ కేసులో శిక్షతో పాటు ఆయనకు రూ.8వేలను జరిమానాగా విధిస్తూ తీర్పును వెలువరించింది. ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్య ప్రాంతానికి చెందిన గోసాయ్ గంజ్ ఎమ్మెల్యే ఇంద్రప్రతాప్ తివారీ అలియాస్ కబ్బు తివారీకి 28 ఏళ్ల పాత కేసులో ప్రత్యేక న్యాయస్థానం తీర్పును వెలువరించింది. ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి పూజా సింగ్ ఈ మేరకు తీర్పును వెలువరించగా, న్యాయస్థానానికి హాజరైన ఎమ్మెల్యేను పోలీసులు అక్కడే అదుపులోకి తీసుకున్నారు.
1992 లో తివారీపై నకిలీ మార్కుల మెమోపై కేసు నమోదైంది. అయోధ్యలోని సాకేత్ డిగ్రీ కళాశాలలో చదువుకున్న ఆయన తన గ్రాడ్యూయేషన్ రెండవ సంవత్సరం పరీక్షలలో ఫెయిల్ అయ్యారు. అయితే తన చదవును కొనసాగించేందుకు ఆయన తన ఫెయిల్ అయిన సర్టిఫికేట్లకు బదులుగా తాను ఉత్తీర్ణత సాధించినట్టు ఫేక్ సర్టిఫికేట్లు సమర్పించి మూడవ సంవత్సరం చదివేందుకు ప్రయత్నించారు. కాగా ఆయన సమర్పించినది నకిలీ సర్టిఫికేట్ అని గ్రహించిన కాళాశాల ప్రిన్సిపాల్ యదువంశ్ రామ్ త్రిపాఠి.. రామ జన్మభూమి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
ఎన్నో మలుపులు తీసుకున్న ఈ కేసులో పోలీసులు కూడా ఏకంగా 13 సంవత్సరాల తర్వాత ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. ఈ కేసుకు సంబంధించిన అనేక ఒరిజినల్ సర్టిఫికేట్లు రికార్డుల నుంచి అదృశ్యమయ్యాయి. దీంతో కేసును జిరాక్స్ కాఫీలతో విచారణ చేయాల్సి వచ్చింది. దీంతో ఈ కేసులో తీర్పు వెలువడేందుకు ఏకంగా 28 సంవత్సరాలు పట్టింది. ఈ కాలక్రమంలో కేసును నమోదు చేసిన ప్రిన్సిపాల్ యదువంశ్ రామ్ త్రిపాఠి కూడా మరణించారు. దీంతో అప్పటి సాకేత్ కళాశాల డీన్ మహేంద్ర కుమార్ అగర్వాల్, ఇతర సాక్షులు తివారీకి వ్యతిరేకంగా సాక్ష్యమిచ్చారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more