ఓ విద్యార్థి తరగతులకు హాజరుకాలేదిని తరగతి గదిలో తోటి విద్యార్థుల సమక్షంలో విద్యార్థులందరూ తీవ్ర భయాందోళన చెందేలా ఓ ఉపాధ్యాయడు చావచితగ్గొట్టిన ఘటన కలకలం రేపింది. అయితే మాస్టారు ప్రతి విద్యార్థిపై ఇలానే రెచ్చిపోయి మరీ కర్రలు విరేగిలా.. విద్యార్థుల వంటిపై వాతలు తేలేలా కోడుతున్నాడు. విద్యార్థులు చెప్పిన పాఠాలు సరిగ్గా గుర్తుపెట్టుకోలేకపోయినా.. చెప్పకుండా పాఠశాలకు రాకపోయినా విద్యార్థులు ఈ మాస్టారు క్లాస్ ఉందంటే చాలు తలుచుకుంటేనే ఫ్యాంటు తడుపుకునేలా చేయిస్తారు. ఇక తరగతి గదిలో అందరి విద్యార్థుల ముందు.. వాయించి వదిలిపెడతారు. అయితే అందరి మాస్టారుల్లా ఏదో కర్రతో రెండు చేతులపై కొట్టి ఊరుకోరు.. కర్ర మాత్రమే కాదు మద్యమధ్యలో ఆయన తన కాలిని కూడా వినియోగిస్తుంటారు.
విద్యార్థులంటే చిన్నారులు అని చెప్పాల్సిన మాస్టారే తన వయస్సుకు, బరువుకు భారమైన పనులు చేస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. మాస్టారంటే భయంతో పాఠాలు నేర్చుకోవాలంటే కష్టం.. మాస్టారుపై ఇష్టంతో కష్టమైన పాఠాన్ని కూడా ఇష్టంగా నేర్చుకునేలా చేయాల్సినవారు మాస్టారు అన్న విషయాన్ని ఈయనకు మళ్లీ తరగతి గదికి పంపించి నేర్చించాలో ఏమోమరి. మాస్టారు గారు అఘాయిత్యాలను నిత్యం చవిచూస్తున్న విద్యార్థులు ఆయన విపరీతచర్యల దృశ్యాలను స్మార్ట్ ఫోనులో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయగా, అది వైరల్ అవుతోంది. తమిళనాడులో నిదురై కలియమూర్తి నగర్ ప్రాంతంలో ఉన్న నందనార్ పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది.
విద్యార్థి జుట్టు పట్టుకుని, కర్రతో ఉపాధ్యాయుడు కొట్టాడు. అలాగే, కింద పడేసి తన్నాడు. ఈ వీడియోను కాంగ్రెస్ నేత చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం కూడా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. విద్యార్థులను ఇంతలా కొట్టే అధికారం ఏ ఉపాధ్యాయుడికీ లేదని ఆయన అన్నారు. ఆ టీచర్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థిని కొట్టిన టీచర్ పేరు సుబ్రహ్మణ్యం అని తెలిసింది. ఏడుగురు విద్యార్థులు పాఠశాలకు సరిగ్గా హాజరు కావడం లేదని వారందరినీ టీచర్ కొట్టాడు. వారిలో ఒక విద్యార్థిని కొడుతుండగా మరో విద్యార్థి ఈ వీడియో తీశాడు. ఈ ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు.
#PTS I சிதம்பரம், நந்தனார் அரசு பள்ளியில் வகுப்புக்கு சரியாக வராத மாணவனை அடித்து உதைத்த அரசுப் பள்ளி ஆசிரியர்.. வீடியோ வாட்சப்பில் வெளியானதால் பரபரப்பு ..@Anbil_Mahesh#PTSNews I #GovtSchoolTeacher I #Chidambaram pic.twitter.com/LjG95y0e0M
— PTS News (@ptsnewstamil) October 14, 2021
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more