ఉత్తరప్రదేశ్ లోని లఖీంపూర్ ఖేరీలో రైతులను వాహనంతో తొక్కించిన ఘటనపై బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ మరోసారి తన సొంత పార్టీ నేతలపై చాలా ఘాటుగా స్పందించారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని అందోళన చేస్తున్న రైతులను హత్యలతో భాయందోళనలకు గురిచేయలేరని.. హక్కుల సాధన కోసం పోరాడుతున్న నిరసనకారుల నోళ్లు మూయించలేరని ఆయన ట్వీట్ చేయడం గమనార్హం. రైతులను జీపులతో తోక్కించిన ఘటనపై గళమెత్తిన ఏకైక అధికార బీజేపి పార్టీ పార్లమెంటు సభ్యుడిగా వరుణ్ గాంధీ నిరసిస్తూన్నారు.
రైతు రాజ్యం కోసం కట్టుబడి వారికి పలు పథాకాలు, పంట పెట్టుబడిగా కొంత డబ్బను కూడా అందిస్తున్న కేంద్రం ఉదారత ఎంతో మంది రైతుల జీవితాల్లో కొంత భరోసాను నింపిందని అన్నారు. అత్యంత దారుణమైన లఖీంపూర్ ఖేరీ ఘటనలతో కేంద్రం ప్రతిష్టను దిగజార్చే చర్యలు జరుగుతున్నాయని ఆయన అరోపించారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన స్పష్టమైన వీడియోను షేర్ చేశారు. ఇందులో వెనుక వేగంగా వచ్చిన థార్ వాహనం రైతులను తొక్కుకుంటూ వెళ్లడం చూడొచ్చు. ఆ వెంటే మరో ఎస్యూవీ వేగంగా వెళ్లిపోయింది. ఈ ఘటనతో బిత్తరపోయిన రైతులు భయాందోళనలకు గురై అటూఇటూ పరుగెత్తడం ఈ వీడియోలో చూడొచ్చు.
ఈ వీడియోనే వరుణ్ గాంధీ సాక్ష్యంగా చూపిస్తూ.. వీడియోలో స్పష్టంగా తేలిపోయింది. హత్యలతో నిరసనకారుల నోళ్లు మూయించలేరు. అమాయక రైతుల రక్తం కళ్ల చూసిన వారిని బాధ్యులను చేయాలి. ఈ క్రూరత్వం, అహంకారానికి సంబంధించిన సందేశం రైతుల మెదళ్లలోకి వెళ్లక ముందే న్యాయం జరగాలి అని ట్వీట్ చేశారు. లఖీంపూర్ ఖేరీ ఘటనపై మొదటి నుంచీ బీజేపీ ఎంపీ అయిన వరుణ్ గాంధీ తీవ్రంగానే స్పందిస్తున్నారు. మంగళవారం కూడా ఈ ఘటనకు సంబందించిన వీడియోను షేర్ చేస్తూ.. బాధ్యులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
The video is crystal clear. Protestors cannot be silenced through murder. There has to be accountability for the innocent blood of farmers that has been spilled and justice must be delivered before a message of arrogance and cruelty enters the minds of every farmer.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more