కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, సహా దేశవ్యాప్తం రైతులు దేశ రాజధాని ఢిల్లీ శివార్లలోని సింఘు, టిక్రీలలో గత ఏడాది డిసెంబర్ 26 నుంచి చేపట్టిన నిరసనలు పది నెలలకు చేరుకుంది. ఈ క్రమంలో ఈనెల 27న రైతు సంఘాలతో పాటు విపక్షాలు, పలు కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, బ్యాంకు అసోసియేషన్లతో కలసి పిలుపునిచ్చిన భారత్ బంద్ ను జయప్రదం చేశారు. ఈ క్రమంలో రైతు సంఘాల నిరసన ప్రదర్శనలతో తమ రాకపోకలకు విఘాతం కలుగుతోందని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పలు పిటీషన్లు దాఖలయ్యాయి.
ఢిల్లీకి చేరుకునే రహదారులపై ప్రయాణంలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు గురువారం విచారించింది. ఈ సందర్భంగా రైతుల అందోళనలపై ఎందుకు స్పందించడం లేదని కేంద్రం, హర్యానా ప్రభుత్వాలకు అంక్షితలు వేసింది. ఈ క్రమంలోనే అటు రైతు సంఘాల నేతల తీరుపై కూడా అసహనం వ్యక్తం చేసింది. రహదారుల దిగ్బంధనంతో రైతుల సమస్యలు పరిష్కారం అవుతాయా.? ఎందుకని కావాలని జాతీయ రహదారులపై వాహనాలను అడ్డుకుంటున్నారని ప్రశ్నించింది. రహదారులపై నిరసనలు ఎలా చేపడతారని ప్రశ్నించింది. జాతీయ రహదారులను దిగ్బంధించడం సమస్యకు పరిష్కారం కాదని పేర్కొంది.
కాగా పిటీషన్ల విచారణ నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రైతు సంఘాలు నిర్దేశించిన ప్రాంతాల్లోనే ఆందోళనలు, నిరసనలు చేపట్టాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. జ్యుడీషియల్ ఫోరం, పార్లమెంటరీ చర్చలతోనే రైతు సమస్యలకు పరిష్కారం లభిస్తుందని.. అంతేకాని రహదారుల దిగ్భంధనంతో కాదని పేర్కొంది. కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. సమస్య పరిష్కారానికి ఉన్నతస్థాయి కమిటీ నియమించామని, చర్చలకు నిరసనకారులు నిరాకరించారని తెలిపారు.
దీనిపై కోర్టు స్పందిస్తూ కోర్టులు సూచించిన వాటిని మీరు అమలు చేయాల్సి పేర్కొంది. అయితే ఈ కేసులో ఎవరైనా పార్టీ కావాలని మీరు కోరుకుంటే.. పిటిషన్ దాఖలు చేయాలని చెప్పింది. ఈ మేరకు రైతులను ప్రతివాదులుగా చేర్చాలని ధర్మాసనానికి విజ్ఞప్తి చేయగా.. ఇందుకు సంబంధించి పిటిషన్ దాఖలు చేయాలని ధర్మాసనం కేంద్రాన్ని ఆదేశించింది. కేసు విచారణను అక్టోబర్ 4వ తేదీకి వాయిదా వేసింది. అంతకు ముందు హర్యానా ప్రభుత్వం సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. హైవేపై ట్రాఫిక్ జామ్ను క్లియర్ చేసేందుకు నిరసన తెలుపుతున్న రైతులను ఒప్పించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పేర్కొంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more