పశ్చిమ బెంగాల్ లోని మూడు, ఒడిశాలోని ఒక అసెంబ్లీ స్థానానికి ఇవాళ ఉపఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ లో ఓటర్లు తమ అమూల్యమైన హక్కును వినియోగించుకుంటున్నారు. ఒడిశాలోని పిపిల్లి అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు పశ్చమ బెంగాల్ లోని భవానీపూర్, సంషేర్ గంజ్, జాంగీపూర్ అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరుగుతున్నాయి. అయితే యావత్ రాష్ట్రంతో పాటు దేశం దృష్టిని ఆకర్షించినది మాత్రం భవానీపూర్ నియోజకవర్గమే. ఎందుకంటే ఈ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ బరిలో నిలిచారు.
కాగా భవానీపుర్ నియోజకవర్గం ఉపఎన్నికలకు ఉదయం 7 గంటలకు తెరలేచినా.. ఓటర్లు మాత్రం పెద్దగా ఉపఎన్నికలపై శ్రద్దచూపడం లేదని తెలుస్తోంది. ఉదయం నుంచి ఎన్నికలు మందకొడిగానే సాగుతున్నాయి. మధ్యాహ్నం 1 గంట సమయానికి కూడా ఇక్కడ పోలింగ్ 36శాతాన్ని మించలేదు. దీంతో ఓటర్ల నిరాసక్తత కొట్టోచ్చినట్టు కనబడుతోంది. ఐదు మాసాల్లో రెండు సార్లు ఎన్నికలు రావడంతో ఓటర్లు పెద్దగా పోలింగ్ పై దృష్టి సారించినట్లు లేదు. ఇకఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల అనంతరం చెలరేగిన హింస కూడా పోలింగ్ తక్కువగా నమోదయ్యేందుకు కారణంగా మారిందా.? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.
కాబా బవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2011, 2016లో పోటీ చేసిన మమతా బెనర్జీ.. ఈ నియోజకవర్గాన్ని తన కంచుకోటగా మార్చుకున్నారు. అయితే ఇటీవలి ఎన్నికల్లో అమె నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి.. బీజేపి నేత సువేందు అధికారి చేతిలో స్వల్ప ఓట్లతో ఓటమి పాలయ్యారు. దీంతో భవానిపూర్ ఎమ్మెల్యే టిఎంసి నేత సోవాందేబ్ చటోపాధ్యాయ్ రాజీనామా చేశారు. కాగా ఈ ఉప ఎన్నికలలో మమతా బెనర్జీతో బీజేపీ అభ్యర్థి ప్రియాంకా తిబ్రేవాల్ పోటీపడుతున్నారు. కొల్ కత్తా హైకోర్టులో 41 ఏళ్ల తిబ్రేవాల్ న్యాయవాదిగా వ్యవహరిస్తున్నారు. భావానిపూర్ నియోజకవర్గం నుంచి గెలిస్తేనే మమత ముఖ్యమంత్రిగా వ్యవహరించ గలుగుతారు. కాగా, అక్టోబర్ 3న ఫలితాలు వెలుబడుతాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more