బ్రిటీష్ పాలకులహయాంలో సర్ అధుర్ థామస్ కాటన్ అనే ఇరిగేషన్ ఇంజనీరు నిర్మించిన ధవళేశ్వరం బ్యారేజీపై జనసేన పార్టీ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు నిర్వహించ తలపెట్టిన శ్రమదానానికి అనుమతి లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబరు2న జనసేన పార్టీ శ్రమదానం చేయాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, అందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జల వనరుల శాఖ అనుమతి నిరాకరించింది. జనసేనాని పవన్ కల్యాణ్ శ్రమదాన కార్యక్రమం చేపట్టాలనుకున్న కాటన్ బ్యారేజీ రాష్ట్ర రోడ్లు భవనాల పరిధిలోకి రాదని జలవనరుల శాఖ ఎస్ఈ స్పష్టం చేసింది.
ఇది జలవనరుల శాఖకు చెందిన బ్యారేజీ అని.. అయితే ఈ బ్యారేజీపై ప్రజల రాకపోకలకు అనుమతి ఇస్తున్నామని ప్రకటన చేసింది. కాటన్ బ్యారేజీపై సాంకేతిక పరిజ్ఞానం లేకుండా గుంతలను పూడ్చితే బ్యారేజీకి నష్టం జరుగుతుందని జలవనరుల శాఖ తెలిపింది. కాగా, దీనిపై కూడా జనసేన కార్యకర్తులు ధీటుగానే కౌంటర్ ఇస్తున్నారు. ప్రజలను అనుమతిస్తూన్న తనుణంలో రో్డు గోతులమయంగా మారితే ఎందుకు పూడ్చకుండా కాలక్షేపం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఆర్ అండ్ బి పరిధిలోకి రాని బ్రిడ్జిపై గోతులను పూడ్చేందుకు మాత్రం ఆర్ అండ్ బి నిధులు కావాలా.? అంటూ ప్రశ్నిస్తున్నారు.
ఇక జనసేన అది నాయకత్వం మాత్రం కావాలనే ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారని బ్యారేజీపై రోడ్డు బాగు చేసే కార్యక్రమాన్ని జరిపి తీరుతామని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఈ రోజు మధ్యాహ్నం జనసేన అధినేత పవన్ కల్యాణ్ తమ నేతలు, కార్యకర్తలతో మరోసారి భేటీ కానున్నారు. అక్టోబరు 2న చేపట్టాల్సిన రోడ్ల శ్రమదానం కార్యక్రమంపై ఆయన చర్చించనున్నారు. అన్ని నియోజక వర్గాల్లోనూ శ్రమదానంలో జనసైనికులు, ప్రజలు పాల్గొనేలా కార్యాచరణ రూపొందించనున్నారు. ఈ సందర్భంగా పవన్ మీడియాతో మాట్లాడబోరని ప్రత్యేకంగా చెప్పింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more