దీపావళి పండగ అనగానే చిన్నారుల నుంచి పెద్దల వరకు నూతన ఉత్తేజంతో, ఉత్సాహంతో పండగ సంబరాల్లో పాల్గోంటారు. అందుకు కారణం బాణాసంచా కాల్చడమే. అయితే ఈ ఏడాది బాణాసంచా విక్రయాలను పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ఆయా ప్రభుత్వాలు నిషేధం విధించాయి. గత ఏడాది కొనసాగించిన విధంగానే ఈసారి కూడా యధాతధంగా నిసేధం కోనసాగుతున్నట్లు అదేశాలు జారీ చేశాయి. ఈ నేపథ్యంలో ఏకంగా సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తలుపుతట్టిన బాణాసంచా తయారీదార్లకు అక్కడ చుక్కెదురైంది. వీటి తయారీలో విషపూరితమైన బేరియం సహా పలు పదార్థాలను వినియోగించడంపై అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
బాణాసంచాలో బేరియం సహా పలు విషపూరితమైన పదార్థాలను వినియోగించడం.. 2018లో సర్వోన్నత న్యాయస్థానం జారీ చేసిన ఉత్తర్వులను అతిక్రమించడమేనని పేర్కోంది. గతంలో ఇచ్చిన అదేశాల మేరకు బాణాసంచాలో ఎలాంటి విషపూరిత పదార్థాలను వినియోగించరాదని న్యాయస్థానం అదేశాలు జారీ చేసిన విషయాన్ని గుర్తిుచేసింది. కొందరి ప్రజలు ఉపాధి హక్కు నేపథ్యంలో ప్రజలందరీ ఆరోగ్యాన్ని పణ్ణంగా పెట్టలేమని.. కొందరి ఉపాధి హక్కు కోసం ప్రజల జీవించే హక్కును కాలరాయలేమని పేర్కోంది.
అమాయకుల జీవించే హక్కును పరిరక్షించడమే తమ విధి అని పేర్కొంది. ఈ మేరకు జస్టిస్ ఎంఆర్ షా, ఏఎస్ బొప్పన్నాలతో కూడిన సర్వోన్నత న్యాయస్థాన ధర్మాసనం అభిప్రాపయపడింది. బాణాసంచా తయారీలో బేరియం వినియోగించడంతో పాటు వాటిని ఫలానా కంపెనీ బాణాసంచాగా ముద్రించి విక్రయాలు జరపడం న్యాయస్థానం అదేశాలను అతి్రక్రమించడమేనని అత్యున్నత న్యాయస్థానం పేర్కోంది. బాణాసంచా తయరీలో విషపూరిత రసాయానాలు వినియోగించడంపై హిందుస్తాన్ ఫైర్ వర్క్స్, స్టాండర్డ్ ఫైర్ వర్స్ పేద్ద మొత్తంలో బేరియని కొనుగోలు చేయడాన్ని సుప్రీం అక్షేపించింది.
ఇక పర్యావరణ హిత బాణాసంచాలుగా సంబంధిత కమిటీలతో అమోదం పోందిన వాటి విక్రయాలను అనుమతిస్తామని తెలిపింది. దేశంలో చట్టాలున్నా వాటి అమలు కష్టతరం అవుతోందని వ్యాఖ్యానించింది. కాగా, బాణసంచా తయారీదారుల సంఘం కూడా తన వాదనలను వినిపించింది. దీపావళి పండుగ దగ్గరకొస్తోందని, టపాసుల విషయంలో పెట్రోలియం, పేలుడు పదార్థాల భద్రత సంస్థ త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరింది. ప్రస్తుతం లక్షల మంది ఉపాధి లేకుండా ఉన్నారని పేర్కొంది. అయితే, వారి ఉపాధి కోసం ఇతరుల హక్కులను కాలరాయలేమన్న సుప్రీంకోర్టు.. తదుపరి విచారణను అక్టోబర్ 6కు వాయిదా వేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more