మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ప్రధాన నిందితుడు సునీల్ యాదవ్ ను అరెస్టు చేసిన సీబిఐ.. ఈ కేసులో సమగ్ర దర్యాప్తును చేస్తోంది. ఈ హత్యకేసులో ప్రధాన నిందితుడు పట్టుకున్న తరువాత వారు హత్యకు వినియోగించిన ఆయుధాలపై దృష్టిసారించిన సీబిఐ వాటిని స్వాధీనం చేసుకుంది. ఈ క్రమంలో తమ విచారణను వేగం పెంచిన సీబిఐ.. వైఎస్ కుటుంబం సమీప బంధువులు, సన్నిహితులపైన దృష్టి సారించారు అధికారులు. పులివెందుల ఆర్ అండ్ బీ గెస్ట్ హౌజ్ లో పలువురిని విచారించారు. గత 91 రోజులుగా కేసును విచారిస్తున్న సీబిఐ ఈ కేసులో తెరవెనుకనున్న వ్యక్తుల కూపీ లాగేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు.
ఈ నేపథ్యంలో వైఎస్ వివేకా తనయ సునిత కూడా సీబిఐ అధికారులను కలుస్తూ.. ఎప్పటికప్పుడు తమ అనుమానాలను నివృత్తి చేసుకుంటూనే వున్నారు. ఈ క్రమంలో తాజాగా మరో నలుగురు అధికార పక్షానికి చెందిన నేతలను కూడా సిబిఐ విచారించనుంది. అయితే వీరంతా ఇప్పటికే ఈ కేసులో అనుమానితులుగా వున్నారని సమాచారం. వీరిలో పులివెందుల మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ మధుసూదన్రెడ్డి, తొండూరు జడ్పీటీసీ మాజీ సభ్యుడు శివమోహన్రెడ్డి ఉన్నారు. కడపలో వీరిని విచారించిన అధికారులు వారి నుంచి కీలక విషయాలను రాబట్టినట్టు తెలుస్తోంది.
అలాగే, పులివెందులకు చెందిన చెప్పుల దుకాణం యజమాని మున్నా, అతడి తల్లి బీబీని పులివెందుల ఆర్ అండ్ బీ అతిథిగృహంలో విచారించారు. హత్య జరగడానికి రెండు నెలల ముందునుంచీ వివేకానందరెడ్డి ఎవరెవరితో ఫోన్ లో మాట్లాడారో కాల్ డేటా ద్వారా వివరాలు సేకరించిన అధికారులు దాని ఆధారంగా అనుమానితులను విచారిస్తున్నారు. ఇప్పటికే వివేక తనయ సునిత అనుమానాల మేరకు కడప ఎంపీ అవినాష్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని సీబిఐ అధికారులు విచారించిన విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more