CBI to inquire four leaders of YSRCP party in YS Viveka case మరో ఇద్దరు వైసీపీ నేతలను విచారించనున్న సీబిఐ

Ys vivekananda reddy murder case cbi to inquire four including two leaders of ysrcp party

CBI, murder case, Vivekananda, YS Rajasekhara Reddy, YS JaganMohan Reddy, YSRCP state secretary, Devireddy SivaShanker Reddyy, Raghunatha Reddy, Sunil Yadav, Rangaiah, servent, Erra Gangireddy​, Jagadishwar Reddy, Gangadhar, CBI, YS Vivekananda Reddy murder case, Sunitha Reddy, Kadapa central prison, guest house, close aids, Pulivendula, kadapa, andhra pradesh, crime, Politics

More than two years after the grisly murder of YS Vivekananda Reddy, the main accused in the case has been remanded for 14 days by Pulivendula court. Now the CBI widens probe angle and inquires four more suspects out of which two are leaders of YSRCP party.

వైఎస్ వివేక హత్యకేసు: ఇద్దరు వైసీపీ నేతలతో మొత్తం నలుగురిని విచారించనున్న సీబిఐ

Posted: 09/06/2021 01:59 PM IST
Ys vivekananda reddy murder case cbi to inquire four including two leaders of ysrcp party

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ప్రధాన నిందితుడు సునీల్ యాదవ్ ను అరెస్టు చేసిన సీబిఐ.. ఈ కేసులో సమగ్ర దర్యాప్తును చేస్తోంది. ఈ హత్యకేసులో ప్రధాన నిందితుడు పట్టుకున్న తరువాత వారు హత్యకు వినియోగించిన ఆయుధాలపై దృష్టిసారించిన సీబిఐ వాటిని స్వాధీనం చేసుకుంది. ఈ క్రమంలో తమ విచారణను వేగం పెంచిన సీబిఐ.. వైఎస్ కుటుంబం సమీప బంధువులు, సన్నిహితులపైన దృష్టి సారించారు అధికారులు. పులివెందుల ఆర్ అండ్ బీ గెస్ట్ హౌజ్ లో పలువురిని విచారించారు. గత 91 రోజులుగా కేసును విచారిస్తున్న సీబిఐ ఈ కేసులో తెరవెనుకనున్న వ్యక్తుల కూపీ లాగేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు.

ఈ నేపథ్యంలో వైఎస్ వివేకా తనయ సునిత కూడా సీబిఐ అధికారులను కలుస్తూ.. ఎప్పటికప్పుడు తమ అనుమానాలను నివృత్తి చేసుకుంటూనే వున్నారు. ఈ క్రమంలో తాజాగా మరో నలుగురు అధికార పక్షానికి చెందిన నేతలను కూడా సిబిఐ విచారించనుంది. అయితే వీరంతా ఇప్పటికే ఈ కేసులో అనుమానితులుగా వున్నారని సమాచారం. వీరిలో పులివెందుల మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, తొండూరు జడ్పీటీసీ మాజీ సభ్యుడు శివమోహన్‌రెడ్డి ఉన్నారు. కడపలో వీరిని విచారించిన అధికారులు వారి నుంచి కీలక విషయాలను రాబట్టినట్టు తెలుస్తోంది.

అలాగే, పులివెందులకు చెందిన చెప్పుల దుకాణం యజమాని మున్నా, అతడి తల్లి బీబీని పులివెందుల ఆర్ అండ్ బీ అతిథిగృహంలో విచారించారు. హత్య జరగడానికి రెండు నెలల ముందునుంచీ వివేకానందరెడ్డి ఎవరెవరితో ఫోన్ లో మాట్లాడారో కాల్ డేటా ద్వారా వివరాలు సేకరించిన అధికారులు దాని ఆధారంగా అనుమానితులను విచారిస్తున్నారు. ఇప్పటికే వివేక తనయ సునిత అనుమానాల మేరకు కడప ఎంపీ అవినాష్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌ రెడ్డిని సీబిఐ అధికారులు విచారించిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles