మాజీ మంత్రి దివంగత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కేంద్ర దర్యాప్తు బృందం విచారణ జరుపుతూ కీలక విషయాలను రాబడుతోన్న నేపథ్యంలో తమ ప్రాణాలకు ముప్పు ఉందని ఆయన కుమార్తె సునీత కడప జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కేసులో నిందితులు ఎవరన్నది ఇప్పుడిప్పుడే సీబిఐ నిగ్గుతేల్చతూ.. కేసు విచారణను వేగం చేస్తోంది. ఈ క్రమంలో కేసును ఇంతటితో వదిలిపెట్టాలని తనకే బెదిరింపులు వస్తున్నాయని తనను బెదిరిస్తున్నారంటూ వైఎస్ వివేకా తనయ సునిత పోలీసులను ఆశ్రయించారు.
అంతేకాదు తమ ఇంటి ముందు ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగాడుతున్నారని గమనించిన అమె.. తమ ఇంటి ముందు అనుమానిత వ్యక్తి రెక్కీ నిర్వహిస్తున్నాడని జిల్లా ఎస్పీకి పిర్యాదు చేశారు. ఈ నెల 10న ఒక అనుమానితుడు తమ ఇంటి చుట్టూ తిరిగాడని, ఫోన్ కాల్స్ కూడా చేశాడని సునీత ఫిర్యాదులో పేర్కొనడంతో దీనిపై దృష్టి సారించిన పోలీసులు అతడిని గుర్తించారు. నిందితుడిని మణికంఠ రెడ్డిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. తమ కుటుంబానికి భద్రత కల్పించాలని కడప జిల్లా ఎస్పీకి వైఎస్ సునీతా రెడ్డి లేఖ రాశారు.
తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆమె వాపోయారు. ఈ నెల 10న సాయంత్రం 5:20 గంటలకు ఓ అనుమానితుడు తమ ఇంటిచుట్టూ రెండుసార్లు తిరిగాడని, ఇంటి కాంపౌండ్ తరువాతి డోర్ దగ్గర ఆగి ఫోన్ కాల్స్ చేశాడని లేఖలో సునీత పేర్కొన్నారు. శివశంకర్రెడ్డి బర్త్ డే కోసం ఏర్పాటైన ఫ్లెక్సీలోని వ్యక్తిలాగే అనుమానితుడు కనిపించాడని, ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు. చివరికి ఆ వ్యక్తిని మణికంఠరెడ్డి అని తేల్చారని వివరించారు.
కాగా, శివశంకర్రెడ్డికి మణికంఠరెడ్డి అత్యంత సన్నిహితుడని సునీత లేఖలో పేర్కొన్నారు. తన తండ్రి హత్యకేసులో శివశంకర్రెడ్డి కీలకమైన అనుమానితుడని, ఈ పరిణామాల దృష్ట్యా శివశంకర్రెడ్డి పాత్రను నిగ్గుతేల్చాలని ఆమె జిల్లా ఎస్పీని కోరారు. అయితే, వివేకా హత్య కేసులో ఈ రోజు సీబీఐ విచారణకు శివశంకర్రెడ్డి హాజరయ్యారు.అతడిని డీఎస్పీ శ్రీనివాసులు విచారిస్తున్నారు. మణికంఠ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతడిని విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీబిఐ అధికారులు కూడా మణికంఠరెడ్డిని విచారించే అవకాశాలు వున్నాయని సమారారం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more