తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. శ్రీవారి లడ్డూ ప్రసాదం ఎంత పవిత్రమో అంత రుచి. ఈ లడ్డూ రుచి దేనికీ ఉండది. శ్రీవారి ప్రసాదాలు ఎన్ని రకాలు ఉన్నా లడ్డూ ప్రసాదం ప్రత్యేకతే వేరు. ఈ క్రమంలో ఈ లడ్డూ ప్రసాదాలను ఇకనుంచి ఓ ప్రత్యేకమైన కవర్ ప్యాకింగ్ లో అందించనుంది టీటీడీ. ఆ కవర్ పర్యావరణ హితమైనది. భూమిలో చాలా త్వరగా కలిసిపోతుంది. కూరగాయల వ్యర్థాలు, తిండి గింజల నుంచి సేకరించిన పిండి పదార్థంతో ఈ సంచీలు తయారు కావడంతో వాటిని ఉపయోగించేందుకు టీటీడీ అంగీకరించింది.
ప్లాస్టిక్ కవర్లు భూమిలో కలవటానికి వందల ఏళ్లు పడుతుంది. ఇటువంటి కవర్ల వల్ల పర్యావరణానికి తీవ్రమైన హాని కలుగుతోంది. దీంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి ప్లాస్టిక్ కవర్ల స్థానంలో కేవలం కూరగాయల వ్యర్థాలు, తిండి గింజల నుంచి సేకరించిన పిండి పదార్థంతో ఈ సంచీ (ఎకొలాస్టిక్)లు తయారు కావడంతో వాటిని ఉపయోగించేందుకు అంగీకరించింది. ఈ విషయాన్ని భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థకు చెందిన అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లేబొరేటరీ డైరెక్టర్ రామ్మనోహర్బాబు తెలిపారు.
ప్రమాదకర సింగిల్ యూజ్ ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వ సహకారం, నాగార్జున విశ్వవిద్యాలయం, డీఆర్డీవోతో కలసి హైదరాబాద్ నగరంలోని చర్లపల్లి ఇండ్రస్టియల్ ఏరియాలోని ఎకొలాస్టిక్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ తయారు చేసిన బయోడీగ్రేడబుల్ ప్లాస్టిక్ ఉత్పత్తుల (ఎకొలాస్టిక్)ను చర్లపల్లి పారిశ్రామికవాడలో కార్పొరేటర్ బొంతు శ్రీదేవితో కలసి విడుదల చేశారు.ఈ సందర్భంగా రామ్మనోహర్బాబు మాట్లాడుతూ.. ప్లాస్టిక్ వాడకం వల్ల భూమితో పాటు నీరు కూడా కలుషితం అయిపోతోంది. జలచరాలకు ప్రాణాంతకంగా మారుతోందని ప్లాస్టిక్ కు బదులుగా ఎకొలాస్టిక్ వంటి ప్రత్యామ్నాయ ప్లాస్టిక్ను వాడటం అవసరమని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more