ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీకి షాక్ తగిలింది. నాలుగున్నర రూపాయలను కస్టమర్ నుంచి అక్రమంగా లాగిన స్విగ్గీకి ఏకంగా ఇరవై వేల రూపాయల మేర ఫైన్ పడటంతో దూల తీరింది. అంతేకాదు.. నాలుగున్నర రూపాయలను కూడా 9శాతం వడ్డీతో తిరిగి కస్టమర్ కు చెల్లించాలని కన్జూమర్ కోర్టు తీర్పును వెలువరించింది. ఇదంతా కస్టమర్ నుంచి అక్రమంగా జీఎస్టీ వసూలు చేసిన ఫలితం. అనవసరంగా పన్ను విధించడమే కాదు.. వినియోగదారుడిని మానసిక వేధనకు గురి చేసినందుకు వినియోగదారుల ఫోరం ఆగ్రహం వ్యక్తం చేసింది.
వివరాల్లోకి వెళ్తే.. హర్యానాలోని పంచకులకు చెందిన అభిషేక్ గార్గ్ స్విగ్గీ మొబైల్ యాప్ ద్వారా చీజ్ గార్లిక్ స్టిక్, మూడు సాఫ్ట్ డ్రింక్స్ ఆర్డర్ చేశారు. గార్లిక్ స్టిక్కి రూ. 144 కాగా.. కూల్డ్రింక్స్కి రూ.90. బిల్ మాత్రం సాఫ్ట్డ్రింక్స్కి ప్రత్యేకంగా రూ. 4.50 GST వేసింది స్విగ్గి.. కొన్న వస్తువులపై ఎమ్మార్పీ చెల్లించిన తర్వాత ప్రత్యేకంగా కూల్డ్రింక్పై GST వసూలు చేసినట్టు గమనించాడు. కన్సుమర్ గూడ్స్ యాక్ట్ 2006 ప్రకారం.. చట్ట విరుద్ధమని పంచకుల వినియోగదారుల ఫోరాన్ని బాధితుడు ఆశ్రయించాడు.
మధ్యవర్తులమేనని, సాఫ్ట్ డ్రింక్ అమ్మకందారు పాలసీకి అనుగుణంగానే జీఎస్టీ వసూలు చేసినట్టు వివరణ ఇచ్చింది. తమ సర్వీసుల్లో లోపం లేదంటూ పేర్కొంది. స్విగ్గీ వాదనలు విన్న ఫోరం ఆగ్రహం వ్యక్తం చేసింది. స్విగ్గీ ఏ ఛారిటబుల్ ట్రస్ట్ కాదని, వినియోగదారు, అమ్మకందారుల మధ్యవర్తిగా డెలివరీ పనులు నిర్వహిస్తోంది. చట్ట విరుద్ధంగా సాఫ్ట్డ్రింక్పై జీఎస్టీ రూ. 4.50 వసూలు చేయడాన్ని తప్పు పట్టింది. అదనంగా రూ.4.50 పైసలు 9 శాతం వడ్డీతో తిరిగి ఇవ్వాలని ఆదేశించింది. కోర్టు, ఇతర ఖర్చుకుగాను అభిషేక్ గార్గ్కి పదివేలు చెల్లించాలని, పొరపాటుకు జరిమానాగా మరో పదివేలు హర్యానా స్టేట్ కౌన్సిల్ ఆఫ్ చైల్డ్ వేల్ఫేర్కి డిపాజిట్ చేయాలని ఆదేశించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more