ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో పరువు హత్య సంభవించింది. తాను ప్రమించిన యువకుడినే తాను పెళ్లి చేసుకుంటానని భీష్మించిన కూతురుపై అమె కుటుంబసభ్యులే పెట్రోల్ పోసి నిప్పింటించిన ఘటన వైఎస్సార్ కడప జిల్లాలో చోటుచేసుకుంది. తాము చూసిన యువకుడినే పెళ్లి చేసుకోవాలని తల్లిదండ్రులు కోరినా.. తాను ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటానని కూతురు తేల్చిచెప్పడంతో.. తమ మాట వినడం లేదన్న కోసం కూతర్ని సజీవ దహనం చేసి పరువు హత్యకు పాల్పడ్డారు కుటుంబసభ్యులు. కడప జిల్లాలోని రాయచోటిలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. రాయచోటిలో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. ఆ కుటుంబానికి చెందిన యువతి.. ఓ యువకుడిని ప్రేమించింది. ఈ విషయం తల్లదండ్రులకు తెలిసింది. యువతిని మందలించారు. ఆ యువకుడితో పెళ్లి చేసుకుంటుందని భావించిన తల్లిదండ్రులు తమ కూతురికి తమ కులానికి చెందిన వరుడ్ని వెతికే పనిలో నిమగ్నమైంది. ఈ క్రమంలో అమెకు హడావిడిగా పెళ్లి సంబంధాలు చూసి పెళ్లి చేసేందుకు ప్రయత్నించారు. వచ్చిన సంబంధాలన్నీ కూతురు చెడగొడుతున్న విషయం తెలసిని అమె తల్లిదండ్రులు ఆగ్రహానికి గురయ్యారు. కొద్ది రోజులుగా ఈ విషయంలో యువతికి అమె తల్లిదండ్రుల మధ్య ఘర్షణ చోటు చేసుకొంటోంది.
కాగా నిన్న రాత్రి కూడా మరోసారి కుటుంబసభ్యులు యువతిని తమ కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుని సుఖంగా వుండాలని ప్రాధేయపడ్డారు. అయినా యువతి మాత్రం అందుకు నిరాకరించింది. తాను ప్రేమించిన వ్యక్తినే వివాహమాడతానని చెప్పింది. దీంతో ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు..కన్న కూతురిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఇందులో సోదరుడు కూడా ఉన్నాడు. మంటలకు తాళలేక యువతి కేకలు వేయడంతో సోదరి, స్థానికులు వచ్చి మంటలను ఆర్పారు. తీవ్రంగా గాయపడిన ఆ యువతిని కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు విచారిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more