కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం గత సంవత్సరం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులో సింఘు, టిక్రీ ప్రాంతాలలో గత ఆరు నెలలుగా రైతులు చేపట్టిన ఉద్యమం కొనసాగుతోంది. నరేంద్రమోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక బిల్లులను తక్షణం ఉపసంహరించుకోవాలని డిసెంబర్ 26 నుంచి రైతులు తమ సంక్షేమాన్ని కాంక్షించే రైతు సంఘాలతోఈ ఉద్యమాన్ని కోనసాగిస్తునే వున్నారు. చలికి వణుకుతూ, ఎండలకు ఎండుతూ.. ఇక వర్షాలు కురిసినా తాము వెనక్కి తగ్గేది లేదని రైతన్నలు తెగేసి చెబుతున్నారు. ఇక కరోనా లాంటి కష్టకాలంలోనూ రైతులు ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా.. దీక్షాస్థలితోనే తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు.
కరోనా కోసం దీక్షను వదిలేస్తూ బిల్లులతో తమ భవిష్యత్తే అంధకారం అవుతుందని, ఇలాంటి తరుణంలో తాము దీక్షను కొనసాగించేందుకే సముఖంగా వున్నామని రైతులు తెలిపారు. కాగా, ఈ నెల 26తో ఆరు నెలలు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని 40 రైతు సంఘాలతో కూడిన సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ‘బ్లాక్ డే’కు పిలుపునిచ్చింది. జనవరి 26న జరిగిన ట్రాక్టర్ ర్యాలీ విధ్వంసంలో రైతుల మధ్య చీలికలు తీసుకురావాలని, వారిని విభజించాలని ప్రయత్నాలు కూడా జరిగినా రైతులు మాత్రం దీక్షాస్థలిని వీడలేదు. దీంతో ఆలాంటి ఘటనలకు అస్కారం లేకుండా ఈ నెల 26న దేశవ్యాప్తంగా నిరసనలు తెలపేందుకు రైతులు పూనుకున్నారు.
సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) పిలుపునకు తాము సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నామని కాంగ్రెస్ అథినేత్రి సోనియాగాంధీ అన్నారు. ఈ మేరకు ఈ నెల 12న ప్రధాని నరేంద్రమోడీకి ఓ లేఖ కూడా రాశామని పేర్కొన్నారు. దేశానికి అన్నపెట్టే అన్నదాతలకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన మూడు వ్యవసాయ సాగు చట్టాలను తక్షణం ఉపసంహరించుకోవాలని కోరామన్నారు. మరీ ముఖ్యంగా కరోనా కష్టకాలంలోనూ వారు దీక్షస్థలి వద్దే ఉద్యమిస్తూ మహమ్మారి భారిన పడే ప్రమాదం పోంచి వుందని, ఈ తరుణంలో సాగు చట్టాలను ఉపసంహరించుకున్న పక్షంలో రైతులు తమ స్వస్థలాలకు వెళ్లి వ్యవసాయం చేసుకుంటారని కోరుతూ లేఖ రాసినట్లు పేర్కోన్నారు.
తమ లేఖపై స్పందించని కేంద్రాన్ని సాగు చట్టాలు ఉపసంహరించుకోవాలని మరోమారు డిమాండ్ చేశారు. రైతుల పంట ఉత్పత్తులకు స్వామినాథన్ కమీషన్ సిఫార్సుల మేరకు కనీస మద్దతు ధర కల్పించాలని కూడా డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ నెల 26న రైతు సంఘాలు తలపెట్టనున్న బ్లాక్ డే కార్యక్రమానికి 12 ప్రతిపక్ష పార్టీలు మద్దతు పలికాయి. ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనపై ఆయా పార్టీల నేతలు సంతకాలు చేశారు. ఇందులో పలువురు ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్తోపాటు కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్, సీపీఐ నేత డి.రాజా, సీపీఎం నేత సీతారాం ఏచూరి తదితరులు ఉన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more