Opposition parties declare support May 26 protest call రైతు ఉద్యమం: 26న బ్లాక్ డే.. పెరిగిన రాజకీయ మద్దతు

More farmers from punjab haryana head for delhi to intensify stir

farmers protest, farmers protest delhi, farmers bill, farmers protest update, samyukta kisan morcha, opposition farmers, Congress acting president Sonia Gandhi, former prime minister HD Deve Gowda, NCP chief Sharad Pawar, West Bengal CM Mamata Banerjee (TMC), Maharashtra CM Uddhav Thackeray (Shiv Sena), Tamil Nadu CM MK Stalin (DMK), Jharkhand CM Hemant Soren (JMM). former Jammu and Kashmir CM Farooq Abdullah (NC), former Uttar Pradesh CM Akhilesh Yadav (SP), Tejashwi Yadav of the RJD, D Raja of CPI, Sitaram Yechury CPI-M.

In a joint statement the leaders of as many as 12 opposition parties backed the Samyukuta Kisan Morcha's call for a nationwide protest on May 26. Among the signatories are five sitting chief ministers. The farmers' union spearheading the agitation against Centre's three farm laws

ఆరునెలలకు రైతు ఉద్యమం: 26న బ్లాక్ డే.. పెరిగిన రాజకీయ మద్దతు

Posted: 05/24/2021 02:46 PM IST
More farmers from punjab haryana head for delhi to intensify stir

కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం గత సంవత్సరం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులో సింఘు, టిక్రీ ప్రాంతాలలో గత ఆరు నెలలుగా రైతులు చేపట్టిన ఉద్యమం కొనసాగుతోంది. నరేంద్రమోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక బిల్లులను తక్షణం ఉపసంహరించుకోవాలని డిసెంబర్ 26 నుంచి రైతులు తమ సంక్షేమాన్ని కాంక్షించే రైతు సంఘాలతోఈ ఉద్యమాన్ని కోనసాగిస్తునే వున్నారు. చలికి వణుకుతూ, ఎండలకు ఎండుతూ.. ఇక వర్షాలు కురిసినా తాము వెనక్కి తగ్గేది లేదని రైతన్నలు తెగేసి చెబుతున్నారు. ఇక కరోనా లాంటి కష్టకాలంలోనూ రైతులు ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా.. దీక్షాస్థలితోనే తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు.

కరోనా కోసం దీక్షను వదిలేస్తూ బిల్లులతో తమ భవిష్యత్తే అంధకారం అవుతుందని, ఇలాంటి తరుణంలో తాము దీక్షను కొనసాగించేందుకే సముఖంగా వున్నామని రైతులు తెలిపారు. కాగా, ఈ నెల 26తో ఆరు నెలలు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని 40 రైతు సంఘాలతో కూడిన సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) ‘బ్లాక్ డే’కు పిలుపునిచ్చింది. జనవరి 26న జరిగిన ట్రాక్టర్ ర్యాలీ విధ్వంసంలో రైతుల మధ్య చీలికలు తీసుకురావాలని, వారిని విభజించాలని ప్రయత్నాలు కూడా జరిగినా రైతులు మాత్రం దీక్షాస్థలిని వీడలేదు. దీంతో ఆలాంటి ఘటనలకు అస్కారం లేకుండా ఈ నెల 26న దేశవ్యాప్తంగా నిరసనలు తెలపేందుకు రైతులు పూనుకున్నారు.

సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) పిలుపునకు తాము సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నామని కాంగ్రెస్ అథినేత్రి సోనియాగాంధీ అన్నారు. ఈ మేరకు ఈ నెల 12న ప్రధాని నరేంద్రమోడీకి ఓ లేఖ కూడా రాశామని పేర్కొన్నారు. దేశానికి అన్నపెట్టే అన్నదాతలకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన మూడు వ్యవసాయ సాగు చట్టాలను తక్షణం ఉపసంహరించుకోవాలని కోరామన్నారు. మరీ ముఖ్యంగా కరోనా కష్టకాలంలోనూ వారు దీక్షస్థలి వద్దే ఉద్యమిస్తూ మహమ్మారి భారిన పడే ప్రమాదం పోంచి వుందని, ఈ తరుణంలో సాగు చట్టాలను ఉపసంహరించుకున్న పక్షంలో రైతులు తమ స్వస్థలాలకు వెళ్లి వ్యవసాయం చేసుకుంటారని కోరుతూ లేఖ రాసినట్లు పేర్కోన్నారు.

తమ లేఖపై స్పందించని కేంద్రాన్ని సాగు చట్టాలు ఉపసంహరించుకోవాలని మరోమారు డిమాండ్ చేశారు. రైతుల పంట ఉత్పత్తులకు స్వామినాథన్ కమీషన్ సిఫార్సుల మేరకు కనీస మద్దతు ధర కల్పించాలని కూడా డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ నెల 26న రైతు సంఘాలు తలపెట్టనున్న బ్లాక్ డే కార్యక్రమానికి 12 ప్రతిపక్ష పార్టీలు మద్దతు పలికాయి. ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనపై ఆయా పార్టీల నేతలు సంతకాలు చేశారు. ఇందులో పలువురు ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌తోపాటు కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ, ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్, సీపీఐ నేత డి.రాజా, సీపీఎం నేత సీతారాం ఏచూరి తదితరులు ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles